Virat Kohli: టెస్ట్ క్రికెట్‌లో 14 ఏళ్లు.... కోహ్లీ భావోద్వేగం

Bhavana ThotaPublished : May 12, 2025 11:55 AM

టెస్ట్ క్రికెట్‌లో 14 ఏళ్లు పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ తన అనుభవాల్ని అభిమానులతో పంచుకున్నాడు.ఈ క్రమంలో కోహ్లీ కొంచెం  ఎమోషనల్ అయినట్లు తెలుస్తుంది.

భారత క్రికెట్‌లో ప్రతిష్టాత్మకమైన ఫార్మాట్ అయిన టెస్ట్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ తన 14 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. 2011లో వెస్టిండీస్‌పై తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడిన కోహ్లీ, నేటికి సరళమైన కానీ భావోద్వేగపూరితమైన సందేశం ద్వారా తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నాడు.

కోహ్లీ తన భావాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేశాడు. బ్యాగీ బ్లూ క్యాప్‌ను తొలిసారి ధరించిన రోజు నుంచి ఇప్పటి వరకు తాను చేసిన ప్రయాణం గురించి చెప్పుకుంటూ, టెస్ట్ క్రికెట్ తనను ఎంతగానో మార్చిందని పేర్కొన్నాడు. ఈ ఫార్మాట్ తనను పరీక్షించిందని, తీర్చిదిద్దిందని, జీవితాంతం మరిచిపోలేని పాఠాలు నేర్పిందని కోహ్లీ తన పోస్ట్‌లో వెల్లడించాడు.

టెస్ట్ క్రికెట్‌లోని ప్రత్యేకతను వివరించిన కోహ్లీ, తెల్లటి దుస్తులు ధరించడంలో ఓ ప్రత్యేకమైన అనుభూతి ఉందని చెప్పాడు. మౌనంగా ఎదురయ్యే సవాళ్లు, నిశ్శబ్దంలో దాగి ఉన్న విజయాల క్షణాలు, చూసే వారెవ్వరూ లేని చిన్న సంఘటనలు జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంటాయని అతను పేర్కొన్నాడు.

విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్‌ను అత్యంత గౌరవంగా చూసే ఆటగాళ్లలో ఒకడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా ఎన్నో విజయాలను అందించిన ఆయన, భారత టెస్ట్ జట్టును అగ్రస్థానానికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికీ అతని ఆటపై ఉన్న శ్రద్ధ, డెడికేషన్ క్రికెట్ అభిమానులకు ప్రేరణగా నిలుస్తోంది.

ఈ సందర్భంగా కోహ్లీ పంచుకున్న భావోద్వేగపూరిత సందేశం క్రికెట్ అభిమానులను ఎంతగానో కదిలించింది. అతని సుదీర్ఘమైన టెస్ట్ కెరీర్‌లో ఇది ఓ మైలురాయి అని చెప్పొచ్చు.

Read more Articles on
click me!