వెంటవెంటనే రెండు వికెట్లు... పూజారా, రోహిత్ శర్మ అవుట్...

By team teluguFirst Published Feb 15, 2021, 9:51 AM IST
Highlights

పూజారా రనౌట్... రోహిత్ శర్మ స్టంపౌంట్...

55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా...

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన రిషబ్ పంత్...

రెండో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా... మొదటి నాలుగు ఓవర్లలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓవర్‌నైట్ స్కోరు54/1 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా, మరో ఒక్క పరుగు మాత్రమే జోడించి పూజారా, రోహిత్ శర్మ వికెట్లను కోల్పోయింది.

23 బంతుల్లో ఒక్క ఫోర్‌తో 7 పరుగులు చేసిన పూజారా... మొయిన్ ఆలీ బౌలింగ్‌లో షాట్‌కి ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. షాట్ ఆడేందుకు క్రీజు ముందుకొచ్చిన పూజారా, బయటికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు బ్యాట్ స్ట్రక్ అవడంతో రనౌట్ అయ్యాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికే జాక్ లీచ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ స్టంపౌంట్ అయ్యాడు. 70 బంతుల్లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు రోహిత్ శర్మ. అజింకా రహానే స్థానంలో రిషబ్ పంత్‌ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. 10 బంతులాడిన విరాట్ కోహ్లీ, ఇంకా ఖాతా తెరవలేదు. 

click me!