INDvsENG: నాలుగు బంతుల్లో రెండు వికెట్లు... రెండో రోజు ఆట ప్రారంభించగానే...

Published : Feb 14, 2021, 09:46 AM IST
INDvsENG: నాలుగు బంతుల్లో రెండు వికెట్లు... రెండో రోజు ఆట ప్రారంభించగానే...

సారాంశం

నాలుగు బంతుల్లో రెండు వికెట్లు తీసిన మొయిన్ ఆలీ... రెండో రోజు మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయిన టీమిండియా.... క్రీజులో రిషబ్ పంత్...

ఓవర్‌నైట్ స్కోరు 300/6 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియాకి... మొదటి ఓవర్‌లోనూ ఊహించని షాక్ తగిలింది. మొయిన్ ఆలీ బౌలింగ్‌లో రెండో బంతికే అక్షర్ పటేల్ అవుట్ కాగా, ఆ తర్వాత రెండు బంతులకే ఇషాంత్ శర్మ కూడా పెవిలియన్ చేరాడు.

రిషబ్ పంత్ మొదటి బంతికే సింగిల్ తీయడంతో రెండో రోజు మొదటి ఓవర్‌లో ఇంగ్లాండ్‌కి రెండు వికెట్లు దక్కాయి. ఓవర్‌నైట్ స్కోరుకి 50- 75 పరుగులు జోడించి, ఇంగ్లాండ్‌పై పట్టు సాధించాలనుకున్న టీమిండియాకు మొదటి ఓవర్‌లోనే ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది.

రిషబ్ పంత్ ఇంకా క్రీజులోనే ఉన్నా, టెయిలెండర్లతో అతను ఎంత సేపు బ్యాటింగ్ కొనసాగిస్తాడనేదానిపై టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు ఆధారపడి ఉంది. జో రూట్ ఓవర్‌లో భారీ సిక్సర్ బాదాడు రిషబ్ పంత్. 

PREV
click me!

Recommended Stories

IND vs ENG: లార్డ్స్ లో రోహిత్ సెంచరీ కొట్టినా దక్కని విజయం.. భారత్ కొంపముంచిన ఆ 5 తప్పులు ఇవే
IND vs ENG: లార్డ్స్‌లో కొత్త చ‌రిత్ర సృష్టించిన రోహిత్‌.. ఆ ఘ‌న‌త సాధించిన తొలి ప్లేయ‌ర్