రోహిత్ శర్మతో పాటు ఇంగ్లాండ్ టూర్లో ఆయన కుటుంబం... మీడియాతో ముచ్చటించి, క్యూట్ సమాధానాలు చెప్పిన సమైరా...
ఇంగ్లాండ్తో ఐదో టెస్టు ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. జూలై 1న ఇండియా, ఇంగ్లాండ్ మధ్య నిర్ణయాత్మక ఐదో టెస్టు ఆరంభం కావాల్సి ఉండడంతో ఈ సమయానికి రోహిత్ శర్మ కరోనా నుంచి కోలుకుంటాడా? లేదా? అనేది అనుమానంగా మారింది...
రోహిత్ శర్మ ఫిట్నెస్పై నమ్మకం లేక మయాంక్ అగర్వాల్ని స్టాండ్ బై ఓపెనర్గా ఇంగ్లాండ్కి రప్పించింది బీసీసీఐ. ఇప్పటికే టీమిండియాతో కలిసిన మయాంక్ అగర్వాల్ ప్రాక్టీస్ కూడా మొదలెట్టేశారు. అయితే రోహిత్ శర్మ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని, పూర్తిగా నెల రోజుల పాటు రిహాబ్లో ఉండబోతున్నాడని షాకింగ్ కామెంట్లు చేసింది ఆయన కూతురు సమైరా..
ప్రస్తుతం ఇంగ్లాండ్లో లీస్టర్షైర్లో ఉన్న రోహిత్ శర్మ భార్య రితికా, ఆయన కుమార్తె సమైరా... హోటల్ నుంచి బయటికి వస్తున్న సమయంలో కొందరు మీడియా ప్రతినిధులు... ‘డాడీ ఎక్కడ’ అంటూ ప్రశ్నించారు. దానికి క్యూట్గా సమాధానాలు ఇచ్చింది సమైరా...
‘డాడీ రూమ్లో ఉన్నారు. ఆయనకి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆయన పూర్తిగా కోలుకోవడానికి ఫుల్లీ వన్ మంత్ పడుతుంది... ’ అంటూ క్యూట్గా ఇంగ్లీషులో సమాధానం ఇచ్చి, తల్లితో వెళ్లిపోయింది నాలుగేళ్ల సమైరా...
సమైరా క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమైరా చెప్పినట్టు రోహిత్ శర్మ కరోనా నుంచి కోలుకోవడానికి నిజంగా నెల రోజుల సమయం తీసుకుంటే... ఇంగ్లాండ్తో జరగాల్సిన ఐదో టెస్టుతో పాటు ఆ తర్వాత జరిగే వన్డే, టీ20 సిరీస్లకు కూడా ఆయన అందుబాటులో ఉండడు...
Daughter Today at How cute she is 😍😍 MY FATHER IS TAKING REST IN THE ROOM GOT pic.twitter.com/Tbpu0HSUIQ
— Krishna sai ✊🇮🇳 (@Krishna19348905)అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా నుంచి కోలుకోవడానికి ఐదు నుంచి వారం రోజుల సమయం మాత్రమే పడుతోంది. దీంతో రోహిత్ శర్మ, ఇంగ్లాండ్తో జరిగే ఐదో టెస్టుకి అందుబాటులో లేకపోయినా వన్డే, టీ20 సిరీస్ సమయానికి జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నారు అభిమానులు...
తాజాగా సోషల్ మీడియా ద్వారా ఐసోలేషన్లో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు రోహిత్ శర్మ. తాను బాగానే ఉన్నాననే అర్థం వచ్చేలా సింబల్ చూపిస్తున్న ఫోటోలను ఇన్స్టా స్టోరీలో పోస్టు చేశాడు రోహిత్ శర్మ..
ఐపీఎల్ 2022 సీజన్లో ముంబై ఇండియన్స్కి కెప్టెన్గా వ్యవహరించిన రోహిత్ శర్మ, ఆ తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ నుంచి రెస్ట్ తీసుకున్నాడు. కుటుంబంతో కలిసి మాల్దీవుల టూర్కి వెళ్లిన రోహిత్ శర్మ, అక్కడి నుంచి ముంబైకి చేరుకుని, ఆలస్యంగా ఇంగ్లాండ్ చేరుకున్నాడు...
మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ కూడా గాయం కారణంగా జట్టుకి దూరంగా ఉన్నాడు. శస్త్ర చికిత్స కోసం జర్మనీకి చేరుకున్న కెఎల్ రాహుల్, అక్కడి నుంచి నేరుగా ఇంగ్లాండ్ టూర్కి లేదా వెస్టిండీస్ టూర్కి వెళ్లే అవకాశం ఉందని సమాచారం...