రికార్డు బద్దలు కొట్టిన రియాన్, పాత రికార్డు సొంత జట్టుదే

Siva Kodati |  
Published : May 05, 2019, 01:19 PM IST
రికార్డు బద్దలు కొట్టిన రియాన్, పాత రికార్డు సొంత జట్టుదే

సారాంశం

ఐపీఎల్-2019లో రాజస్థాన్ యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అతి పిన్న వయసులో అర్ధశతకం నమోదు చేసి అంతకు ముందున్న రికార్డును బద్ధలు కొట్టాడు

ఐపీఎల్-2019లో రాజస్థాన్ యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అతి పిన్న వయసులో అర్ధశతకం నమోదు చేసి అంతకు ముందున్న రికార్డును బద్ధలు కొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన పరాగ్.. అర్థసెంచరీ నమోదు చేశాడు.

ఈ క్రమంలో ఈ ఘటన సాధించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 17 సంవత్సరాల 175 రోజుల్లోనే అర్ధసెంచరీ సాధించిన పరాగ్.. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన సంజూ శాంసన్ పేరిట ఉన్న రికార్డును చెరిపేశాడు.

రాజస్థాన్ తరపున మొత్తం 7 మ్యాచ్‌లాడిన పరాగ్ 32 సగటుతో 160 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో రాయల్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. 

PREV
click me!

Recommended Stories

Cricket Records: క్రికెట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ షాక్.. 27 పరుగులకే ఆలౌట్.. కేవలం 5 బంతుల్లోనే మ్యాచ్ ఫినిష్
Team India : వైభవ్ సూర్యవంశీ కాదు.. సంజూ శాంసన్ కాదు.. కోహ్లీని రీప్లేస్ చేస్తున్న సీఎస్కే స్టార్ ఎవరో తెలుసా?