10 రోజుల కిందటే కరోనా బారిన పడిన రిషబ్ పంత్...
స్నేహితుల ఇంట్లో ఉంటూ ఐసోలేషన్ పూర్తిచేసుకున్న వికెట్ కీపర్... తాజాగా నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రిజల్ట్...
ఇంగ్లాండ్ టూర్లో ఉన్న భారత జట్టుకి ఇది నిజంగా శుభవార్తే. కరోనా బారిన పడిన యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. తాజాగా అతనికి నిర్వహించిన మూడు పరీక్షల్లో నెగిటివ్ రిజల్ట్ వచ్చింది..
రిషబ్ పంత్కి కరోనా నెగిటివ్ రావడంతో అతను జూలై 21న భారత జట్టుతో కలవనున్నాడు. ప్రస్తుతం లండన్లో స్నేహితుల ఇంట్లో క్వారంటైన్లో గడుపుతున్నాడు రిషబ్ పంత్. అలాగే కరోనా బారిన పడిన భారత టెక్నికల్ సిబ్బందితో కలిసి, క్వారంటైన్లో గడుపుతున్న భారత క్రికెటర్లు వృద్ధిమాన్ సాహా, అభిమన్యు ఈశ్వరన్కి కూడా కరోనా నెగిటివ్ వచ్చింది.
వీరితో పాటు భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్కి కూడా కరోనా నెగిటివ్ వచ్చింది. అయితే వీళ్లు జూలై 24వరకూ క్వారంటైన్లోనే గడపనున్నారు. వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్ అందుబాటులో లేకపోవడతో జూలై 20 నుంచి ప్రారంభమయ్యే మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా తరుపున కెఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయనున్నాడు.