మరోసారి మంచి భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్...
39 పరుగులు చేసిన ఏబీ డివిల్లియర్స్...
హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ...
IPL 2020: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి, 145 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ 15 పరుగులు చేసి అవుట్ కాగా దేవ్దత్ పడిక్కల్ 22 పరుగులు చేశాడు. 46 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ కలిసి మూడో వికెట్కి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
36 బంతుల్లో 4 ఫోర్లతో 39 పరుగులు చేసి ఏబీ డివిల్లియర్స్ అవుట్ కాగా... మొయిన్ ఆలీ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. 43 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్స్తో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న విరాట్ కోహ్లీ, ఆ తర్వాతి బంతికే అవుట్ అయ్యాడు. క్రిస్ మోరిస్ 2, వాషింగ్టన్ సుందర్ 5 పరుగులు చేశాడు.
ఏబీ డివిల్లియర్స్ అవుటైన తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ భారీ స్కోరు చేయలేపోయింది. చెన్నై బౌలర్లలో సామ్ కుర్రాన్ మూడు, దీపక్ చాహార్ 2 వికెట్లు తీశారు.