డబ్బులు ఇవ్వలేదన్నందుకు బ్యాన్ వేశారు... జేమ్స్ ఫాల్కనర్‌పై పీసీబీ నిషేధం...

Published : Feb 19, 2022, 08:28 PM IST
డబ్బులు ఇవ్వలేదన్నందుకు బ్యాన్ వేశారు... జేమ్స్ ఫాల్కనర్‌పై పీసీబీ నిషేధం...

సారాంశం

James Faulkner: రెండు మ్యాచులు మిగిలి ఉండగానే డబ్బులు ఇవ్వడం లేదని పీఎస్‌ఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు ట్వీట్ చేసిన జేమ్స్ ఫాల్కనర్... అతనిపై బ్యాన్ వేసిన పాక్ క్రికెట్ బోర్డు...

ఊపిరి బుగ్గ లాంటి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరువును ఊది పారేశాడు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్కనర్. పాక్‌లో క్రికెట్‌ను సపోర్ట్ చేద్దామని పీఎస్‌ఎల్ ఆడడానికి వస్తే, డబ్బులు ఇవ్వకుండా అవమానించారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు... జేమ్స్ ఫాల్కనర్ ఆరోపణలు, పరువు పోగొట్టుకున్న పాక్ క్రికెట్ బోర్డు... ‘ మేం నీకు ఇవ్వాల్సిన డబ్బులిచ్చేశాం, అయినా ఇలా అసత్య ఆరోపణలు చేస్తావా...’ అంటూ అతనిపై పీఎస్‌ఎల్ ఆడకుండా నిషేధం విధించింది...

‘జేమ్స్ ఫాల్కనర్ ఆరోపణల్లో నిజం లేదు. అతనికి ముట్టచెప్పాల్సిన మొత్తాన్ని 70 శాతం ముందుగానే ఇచ్చేశాం. మిగిలిన 30 శాతం పీఎస్‌ఎల్ ముగిసిన 40 రోజులకు చెల్లించబడుతుంది. ఇది అగ్రీమెంట్‌లో స్పష్టంగా ఉంటుంది. అయినా కావాలనే పీసీబీపై ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నాడు జేమ్స్ ఫాల్కనర్. అతను భవిష్యత్తులో పాక్ సూపర్ లీగ్ ఆడకుండా నిషేధం విధిస్తున్నాం...’ అంటూ స్టేట్‌మెంట్ విడుదల చేసింది పాక్ క్రికెట్ బోర్డు... 

తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదనే కోపంతో లాహోర్‌లో టీమ్ బస చేస్తున్న పీసీ హోటల్‌లోని ఖరీదైన షాండిలయర్‌పై బ్యాటును విసిరి వేశాడట జేమ్స్ ఫాల్కనర్. ఈ దృశ్యాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ఐపీఎల్ మాదిరిగా కాకుండా పాక్ సూపర్ లీగ్‌లో ప్లేయర్లకు నిర్ధిష్టమైన ధర ఉంటుంది. ప్లాటినం కేటగిరి, డైమండ్ కేటగిరి అంటూ ఒక్కో సెట్ ప్లేయర్లకు ఒక్కో ధర డిసైడ్ చేస్తారు. ప్లాటినం గ్రూప్‌లో ఉన్న ప్లేయర్లు అత్యధికంగా రూ.2.3 కోట్లు (పాకిస్తాన్ రూపాయల్లో) దక్కించుకుంటారు. 


డైమండ్ గ్రూప్‌లో ఉన్న ప్లేయర్లకు సీజన్‌కి రూ.1.15 కోట్లు (పాకిస్తాన్ రూపాయల్లో) సొంతం చేసుకుంటారు. షాదబ్ ఖాన్, మహ్మద్ అమీర్, మహ్మద్ నబీ, హరీస్ రౌఫ్, మహ్మద్ హఫీజ్, ఇమ్రన్ తాహీర్‌లతో పాటు జేమ్స్ ఫాల్కనర్ కూడా డైమండ్ కేటగిరీ ప్లేయర్లే... 

పీఎస్ఎల్ 2022 సీజన్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకి ఎంపికయ్యాడు జేమ్స్ ఫాల్కనర్. అయితే సీజన్‌లో ఇంకా రెండు మ్యాచులు ఉన్నప్పటికీ, కాంట్రాక్ట్ ప్రకారం అతనికి ఇవ్వాల్సిన మొత్తం ఇప్పటిదాకా చెల్లించలేదట పాక్ క్రికెట్ బోర్డు...

దీంతో మనస్థాపం చెందిన జేమ్స్ ఫాల్కనర్, పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్ 2022) సీజన్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. ‘పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్‌కి నేను క్షమాపణలు కోరుతున్నా. కానీ నేను పాక్ సూపర్ లీగ్ ఆఖరి రెండు మ్యాచుల నుంచి తప్పుకోవాల్సింది వస్తోంది. నేను సీజన్ మొత్తం ఇక్కడే ఉన్నాను, కానీ వాళ్లు ఇప్పుడిస్తాం? అప్పుడిస్తాం అని అబద్దాలు చెబుతూనే ఉన్నారు...

పాకిస్తాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ తిరిగి ప్రారంభమవ్వడానికి నా వంతు సాయం చేయాలని భావించిన నాకు ఈ సంఘటన బాధను కలిగించింది. పాకిస్తాన్‌లో ఎంతో మంది యంగ్ టాలెంటెడ్ క్రికెటర్లు ఉన్నారు, ఫ్యాన్స్ అయితే అమేజింగ్... అయితే పాక్ క్రికెట్ బోర్డు, పీఎస్‌ఎల్ నాతో ప్రవర్తించిన తీరు, బాధను కలిగించింది... నా పరిస్థితిని మీరంతా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశాడు ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ ఫాల్కనర్...


2015 వన్డే వరల్డ్ కప్ విన్నింగ్ ఆస్ట్రేలియా టీమ్‌లో సభ్యుడైన జేమ్స్ ఫాల్కనర్, ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఫేనే వారియర్స్ ఇండియా, గుజరాత్ లయన్స్, రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడాడు.
అయితే 2017 తర్వాత ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని జేమ్స్ ఫాల్కనర్, ఆస్ట్రేలియా తరుపున ఓ టెస్టు మ్యాచ్‌తో పాటు 69 వన్డేలు ఆడాడు... 

PREV
click me!

Recommended Stories

కోహ్లీ నిర్ణయంతో రోహిత్ యూటర్న్.. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే.?
టీ20ల్లో అట్టర్ ప్లాప్ షో.. అందుకే పక్కన పెట్టేశాం.. అగార్కర్ కీలక ప్రకటన