IPL2021: సిక్సర్లతో అదరగొడుతున్న ధోనీ..!

By telugu news teamFirst Published Aug 25, 2021, 11:47 AM IST
Highlights

ఇప్పటికే.. చెన్నైసూపర్ కింగ్స్ జట్టు.. యూఏఈ చోరుకుంది. అక్కడ ప్రాక్టీస్ మ్యాచులను షురూ చేశారు. ఈ ప్రాక్టీస్ మ్యాచుల్లో.. ధోనీ ససేన అదరగొడుతున్నారు.

ఐపీఎల్ సందడి మళ్లీ మొదలుకాబోతోంది.  కరోనా మహమ్మారి కారణంగా మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్ మ్యాచులను దుబాయి వేదికగా.. నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఈ సందడి మొదలుకానుంది. కాగా..  ఇప్పటికే.. చెన్నైసూపర్ కింగ్స్ జట్టు.. యూఏఈ చోరుకుంది. అక్కడ ప్రాక్టీస్ మ్యాచులను షురూ చేశారు. ఈ ప్రాక్టీస్ మ్యాచుల్లో.. ధోనీ ససేన అదరగొడుతున్నారు.

ముఖ్యంగా ధోనీ, రైనా అయితే నెట్స్‌లో భారీ షాట్లు ఆడుతూ.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. బంతి పడడమే ఆలస్యం.. వీర బాదుడు బాదుతూ.. మాంచి జోష్‌లో కనిపించారు. వీరి నెట్‌ ప్రాక్టీస్‌కు సంబంధించిన తాజా వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. 

 

ఇందులో ధోనీ, రైనా బాధుడును చూసి సీఎస్‌కే అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. త్వరలో ప్రారంభంకాబోయే ఐపీఎల్‌ మలిదశ మ్యాచ్‌ల్లో తమ స్టార్లకు పట్టపగ్గాలుండవని కాలర్‌ ఎగరేస్తున్నారు. కాగా, సెప్టెంబ‌ర్ 19న చెన్నై, ముంబైల మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుంది. ప్రస్తుత సీజ‌న్‌లో చెన్నై జట్టు 7 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 2 పరాజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఈ మ్యాచ్‌ల్లో ధోనీ, రైనా పెద్ద‌గా రాణించింది లేదు. దీంతో ఈ ఇద్ద‌రు స్టార్‌ ఆటగాళ్లు మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా రాణించాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. మరోవైపు ఫారిన్‌ ప్లేయర్‌, ఆసీస్‌ బౌలర్‌ హేజిల్‌వుడ్‌ జట్టుతో చేరడం సీఎస్‌కేలో నయా జోష్ వచ్చింది. 
 

click me!