ఇంగ్లాండ్‌లోని ఇండియన్ రెస్టారెంట్‌లో ఓనం సెలబ్రేషన్స్... ముఖ్యఅతిథులుగా విరాట్, అనుష్క శర్మ ...

By Chinthakindhi RamuFirst Published Aug 24, 2021, 3:06 PM IST
Highlights

అనుష్క శర్మతో కలిసి లీడ్స్‌లోని తరవాడు రెస్టారెంట్‌కి విచ్చేసిన విరాట్ కోహ్లీ...  సోషల్ మీడియాలో విరుష్క జోడీ పిక్స్ వైరల్... 

భారత సారథి విరాట్ కోహ్లీ, ఇంగ్లాండ్ టూర్‌లో ఓనం సెలబ్రేట్ చేసుకున్నాడు. భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి లీడ్స్‌లోని తరవాడు రెస్టారెంట్‌కి విచ్చేసిన విరాట్ కోహ్లీ, అక్కడి భారతీయులతో కలిసి ఓనం సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు...

లండన్‌లోని లార్డ్స్‌లో రెండో టెస్టు పూర్తిచేసుకున్న భారత జట్టు, మూడో టెస్టు కోసం లీడ్స్‌కి బయలుదేరి వెళ్లింది. ఇక్కడే ఓ దక్షిణ భారత రెస్టారెంట్ తరవాడు‌కి విచ్చేసిన ఈ ఇద్దరూ... అక్కడ భారతీయ సంప్రదాయ వంటకాలను రుచి చూశారు...

ఈ రెస్టారెంట్‌లో దిగిన ఫోటోలను విరాట్ కోహ్లీ కానీ, అనుష్క శర్మ కానీ సోషల్ మీడియాలో పంచుకోలేదు. అయితే వారితో కలిసి ఫోటోలు దిగిన హోటల్ నిర్వహకులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు వీటిని పోస్టు చేయడంతో... సోషల్ మీడియాలో విరుష్క జోడీ పిక్స్ వైరల్ అవుతున్నాయి..

రెస్టారెంట్‌లో భోజనం చేసిన తర్వాత ‘ఇక్కడ ఫుడ్ మాకెంతో ఇష్టం. మీ ఆతిథ్యం మాకెంతో నచ్చింది.  ఎంతో ప్రేమగా, అప్యాయంగా మాకు వడ్డించారు. ఆల్ ది బెస్ట్... లవ్ అనుష్క, విరాట్..’ అంటూ రాసిన విరుష్క జోడీ, వారి ఆటోగ్రాఫ్‌లను జత చేశారు.. విరాట్ కోహ్లీతో పాటు భారత క్రికెటర్ రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, శార్దూల్ ఠాకూర్ కూడా ఓనం సెలబ్రేషన్స్‌లో పాల్గొన్ని, కేరళ వంటకాలను ఆస్వాదించారు.

click me!