పెంపుడు కుక్కలతో కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న ధోనీ... కొన్ని నెలల తర్వాత ఇన్‌స్టాలో పోస్ట్...

By Chinthakindhi RamuFirst Published Jul 8, 2023, 5:52 PM IST
Highlights

తన ఇంట్లో పెంపుడు కుక్కలతో కలిసి కేక్ కట్ చేసిన మహేంద్ర సింగ్ ధోనీ.. నాలుగు నెలల తర్వాత ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన మాహీ.. 

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, క్రేజ్‌ని అందుకోవడం ఇప్పట్లో ఏ క్రికెటర్ వల్ల కాదేమో. విరాట్ కోహ్లీకి వీరాభిమానులు ఉన్నా, రోహిత్ శర్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా.. అది ధోనీ క్రేజ్, ఫాలోయింగ్‌తో సమానం కాదు. మహేంద్ర సింగ్ ధోనీ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అభిమానులు... రకరకాలుగా బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపారు..

హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో 52 అడుగుల ధోనీ కటౌట్ పెట్టిన మాహీ ఫ్యాన్స్, సినిమా థియేటర్‌లో ఎమ్మెస్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లను షోలుగా వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఏకంగా 77 అడుగుల ధోనీ కటౌట్ పెట్టారు మాహీ వీరాభిమానులు. నందిగామ సెంటర్‌లో ధోనీ 77 అడుగుల కటౌట్‌కి అభిమానులు, పాలాభిషేకం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. 

Latest Videos

ఓ క్రికెటర్‌కి ఇంత భారీ కటౌట్ పెట్టడం ఇదే తొలిసారి. అభిమానుల, మాహీ బర్త్ డేకి ఇంత హంగామా చేస్తే.. ధోనీ మాత్రం చాలా కూల్‌గా పుట్టినరోజు వేడుకలను కానిచ్చేశాడు. రాంఛీలో తన నివాసంలో మూడు పెంపుడు కుక్కలతో కలిసి కట్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ..

అప్పుడెప్పుడో ఐదు నెలల క్రితం తన ఫామ్‌హౌజ్‌లో పొలం దున్నుతున్న వీడియోను షేర్ చేసిన మహేంద్ర సింగ్ ధోనీ, బర్త్ డే తర్వాతి రోజు తన కుక్కలతో సెలబ్రేషన్స్ జరుపుకున్న వీడియోను షేర్ చేసి... ‘మీ అందరి విషెస్‌కి చాలా థ్యాంక్యూ.. నేను నా బర్త్ డే రోజున ఏం చేశానో చెప్పడానికి ఇది ఓ చిన్న టీజర్’ అంటూ కాప్షన్ జోడించాడు..

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by M S Dhoni (@mahi7781)

ధోనీ వీడియో పోస్ట్ చేసిన గంటలోనే ఈ వీడియోకి 30 లక్షలకు పైగా లైకులు, వేలల్లో లైకులు వచ్చేశాయి. ధోనీ భార్య సాక్షి సింగ్, లవ్ సింబల్స్‌ని కామెంట్ చేయగా భువనేశ్వర్ కుమార్ భార్య నుపుర్ నగర్ ‘ఈ రోజు ఇంటర్‌నెట్‌లో ఇదే క్యూటెస్ట్ వీడియో’ అంటూ కామెంట్ చేసింది.

కోలీవుడ్ హీరోయిన్లు ఐశ్వర్యా లక్ష్మీ,  రమ్యా పాండియన్ కూడా ధోనీ వీడియోపై ‘తలా’ అంటూ లవ్ ఎమోజీలు కామెంట్లు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసిన ధోనీ, సరికొత్త సోషల్ మీడియా యాప్‌ ‘థ్రెడ్స్’లో కూడా ఖాతా తెరిచాడు.. థ్రెడ్స్‌లోనూ మాహీకి కొన్ని నిమిషాల్లోనే వేలల్లో ఫాలోవర్లు వచ్చేశారు.. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి కెప్టెన్‌గా ఐదో టైటిల్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీ, వచ్చే సీజన్‌లో ఆడేది? లేనిదీ స్పష్టంగా చెప్పలేదు. ఎప్పుడూ మాహీ బర్త్ డేకి మరిచిపోకుండా విష్ చేసే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఈసారి ధోనీ బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టలేదు. దీంతో మాహీ రిటైర్మెంట్ గురించి ప్రకటన రాబోతుందని అనుమానిస్తున్నారు తలా ఫ్యాన్స్.. 

click me!