ఆస్ట్రేలియాతో టెస్ట్.. జాతీయగీతం పాడుతూ సిరాజ్ కంటతడి

By telugu news teamFirst Published Jan 7, 2021, 10:23 AM IST
Highlights

 ఆ మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసిన సిరాజ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే మూడో టెస్టులో అవకాశం రావడంతో గురువారం మ్యాచ్ ప్రారంభమైన సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యాడు.

టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ కంటతడి పెట్టాడు. సిరాజ్.. ఇటీవల తండ్రిని కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. అయితే.. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు.

సీనియర్ పేసర్ మహ్మద్ షమీ తొలిటెస్టులో గాయపడగా.. రెండో టెస్టుకు సిరాజ్ ఎంపికయ్యాడు. తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానే ఆ మ్యాచ్ కి ముందు టెస్టు క్యాప్ అందజేసి అరంగేట్రం చేయించాడు. ఈ క్రమంలోనే ఆ మ్యాచ్ లో ఐదు వికెట్లు తీసిన సిరాజ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే మూడో టెస్టులో అవకాశం రావడంతో గురువారం మ్యాచ్ ప్రారంభమైన సందర్భంగా కన్నీటి పర్యంతమయ్యాడు.

సిడ్నీస్ మ్యాచ్ ఆరంభానికి ముందు జాతీయ గీతం ఆలపించే సమయంలో ఈ పేసర్ భావోద్వేగం చెందాడు. ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయాడు. ఇదంతా ప్రత్యక్ష ప్రసారంలో కనిపించడంతో అభిమానులు సైతం విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా.. మ్యాచ్ ఆరంభమైన కొద్దిసేపటికే సిరాజ్ భారత్ కు శుభారంభం అందించాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ని ఔట్ చేశాడు. నాలుగో ఓవర్ లో ఓ చక్కటి బంతిని వేసి బోల్తా కొట్టించాడు. 

click me!