కెఎల్ రాహుల్ అద్భుత సెంచరీ, విరాట్ కోహ్లీ మరో ‘సారీ’... లుంగి ఇంగిడికి మూడు వికెట్లు...

Published : Dec 26, 2021, 08:06 PM ISTUpdated : Dec 26, 2021, 08:57 PM IST
కెఎల్ రాహుల్ అద్భుత సెంచరీ, విరాట్ కోహ్లీ మరో ‘సారీ’... లుంగి ఇంగిడికి మూడు వికెట్లు...

సారాంశం

టెస్టు వైస్ కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే సెంచరీ చేసిన కెఎల్ రాహుల్... 2007లో వసీం జాఫర్ తర్వాత సౌతాఫ్రికాలో సెంచరీ చేసిన భారత ఓపెనర్‌గా రికార్డు...

రోహిత్ శర్మ గైర్హజరీతో సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టెస్టు వైస్ కెప్టెన్సీ దక్కించుకున్న కెఎల్ రాహుల్, ఉపసారథిగా ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగాడు. ఇంగ్లాండ్ టూర్‌లో మయాంక్ అగర్వాల్ గాయపడడంతో అనుకోకుండా టెస్టుల్లో రీఎంట్రీ ఇచ్చిన కెఎల్ రాహుల్‌కి గత నాలుగు టెస్టుల్లో రెండో సెంచరీ కావడం విశేషం. 2007లో కేప్‌టౌన్‌లో సెంచరీ చేసిన వసీం జాఫర్ తర్వాత సౌతాఫ్రికాలో శతకం బాదిన భారత ఓపెనర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. 


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకి మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ కలిసి తొలి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పారు. ఓ ఎండ్‌లో కెఎల్ రాహుల్‌ నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తుంటే, మరో ఎండ్‌లో మయాంక్ అగర్వాల్ బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 89 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు మయాంక్ అగర్వాల్...

సౌతాఫ్రికాలో టీమిండియా ఇప్పటిదాకా 21 టెస్టులు ఆడగా... ఓపెనర్లు శతాధిక భాగస్వామ్యం నమోదుచేయడం ఇది మూడోసారి. ఇంతకకుముందు 2006-07 పర్యటనలో కేప్ టౌన్ టెస్టులో వసీం జాఫర్, దినేశ్ కార్తీక్ కలిసి తొలి వికెట్‌కి 153 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు...

2010-11 సఫారీ టూర్‌లో సెంచూరియన్‌లోనే గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్ కలిసి తొలి వికెట్‌కి 137 పరుగులు జోడించారు. మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ జోడించిన శతాధిక భాగస్వామ్యం మూడోది...

సెంచూరియన్‌లో ఆడిన గత 26 టెస్టుల్లో 21 టెస్టులు గెలిచింది సౌతాఫ్రికా. ఇందులో 52 ఇన్నింగ్స్‌ల్లో పర్యాటన జట్టు ఓపెనర్లు శతాధిక భాగస్వామ్యం జోడించడం ఇది రెండోసారి మాత్రమే కావడం మరో విశేషం...

విదేశాల్లో సెంచరీ భాగస్వామ్యంతో టెస్టు సిరీస్ ఆరంభించడం భారత జట్టుకి ఇదే తొలిసారి. ఇంతకుముందు 1936లో హింద్లేకర్, విజయ్ మర్చెంట్ కలిసి జోడించిన 62 పరుగులే అత్యుత్తమంగా ఉండేది...  

123 బంతులు ఎదుర్కొన్న మయాంక్ అగర్వాల్, 9 ఫోర్లతో 60 పరుగులు చేసి ఇంగిడి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 117 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా...

మయాంక్ అగర్వాల్ అవుటైన తర్వాతి బంతికే ఛతేశ్వర్ పూజారా, భువుమాకి క్యాచ్ ఇచ్చి డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది భారత జట్టు...

పూజారా అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్‌తో కలిసి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఎంతో ఓపిగ్గా ఇన్నింగ్స్ నిర్మిస్తూ, సెంచరీ చేస్తాడని ఆశలు రేపిన కోహ్లీ, హఫ్ సెంచరీ మార్కు కూడా చేరుకోకుండానే పెవిలియన్ చేరాడు...

94 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఇంగిడి బౌలింగ్‌లో ముల్దార్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 222 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్సర్‌తో సెంచరీ మార్కు అందుకున్నాడు కెఎల్ రాహుల్. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs PAK : పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన కుర్రాళ్లు ! భారత్ సూపర్ విక్టరీ
వర్తు వర్మ వర్తు.! వీళ్లు సైలెంట్‌గా పెద్ద ప్లానే వేశారుగా.. ఆ ప్లేయర్స్ ఎవరంటే.?