
ఐపీఎల్ 2022 సీజన్ లో స్కోరింగ్ గేమ్తో ఆరంభమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను స్వల్ప స్కోరుకి కట్టడి చేయడంతో సూపర్ సక్సెస్ అయ్యారు కేకేఆర్ బౌలర్లు... టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 131పరుగులు చేసింది. బ్యాటింగ్ మొదలెట్టిన సీఎస్కేకి తొలి ఓవర్లోనే ఊహించని షాక్ ఇచ్చాడు సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్...
నో బాల్తో ఐపీఎల్ 2022 సీజన్ను ప్రారంభించిన ఉమేశ్ యాదవ్, తొలి ఓవర్ మూడో బంతికే రుతురాజ్ గైక్వాడ్ను డకౌట్ చేశాడు. ఐపీఎల్ 2021 సీజన్లో ఆరెంజ్ క్యాప్ గెలిచి, అతి పిన్న వయసులో ఈ ఫీట్ సాధించిన ప్లేయర్గా రికార్డు క్రియేట్ చేసిన రుతురాజ్ గైక్వాడ్న... 20 ఇన్నింగ్స్ల తర్వాత డకౌట్ అయ్యాడు...
తొలి ఓవర్లో ఓ నో బాల్, రెండు వైడ్లతో 3 ఎక్స్ట్రా పరుగులు ఇచ్చిన ఉమేశ్ యాదవ్.,.. బ్యాటర్కి పరుగు తీసే అవకాశం ఇవ్వలేదు. శివమ్ మావి ఓవర్లో ఫోర్, ఆ తర్వాత ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో సిక్సర్ బాదిన రాబిన్ ఊతప్ప... ఐపీఎల్ 2022 సీజన్లో మొట్టమొదటి బౌండరీలు నమోదుచేసిన బ్యాటర్గా నిలిచాడు...
8 బంతుల్లో 3 పరుగులు చేసిన డివాన్ కాన్వే, ఐదో ఓవర్ తొలి బంతికే శ్రేయాస్ అయ్యర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు ఉమేశ్ యాదవ్.
ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో రాబిన్ ఊతప్ప స్టంపౌట్ అయ్యాడు. 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 28 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప, షెల్డన్ జాక్సన్ మెరుపు వికెట్ కీపింగ్ కారణంగా అవుట్ అయ్యాడు.
ఆ తర్వాతి ఓవర్లో అంబటి రాయుడు కూడా రనౌట్ అయ్యాడు. 17 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్తో 15 పరుగులు చేసిన అంబటి రాయుడు రనౌట్ కావడంతో 52 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్... ఐపీఎల్లో 150 సిక్సర్లు పూర్తి చేసుకుని పెవిలియన్ చేరాడు అంబటి రాయుడు.
ఐపీఎల్లో అత్యధిక సార్లు రనౌట్ అయిన ప్లేయర్గా సురేష్ రైనాతో కలిసి రెండో స్థానంలో నిలిచాడు అంబటి రాయుడు. శిఖర్ ధావన్, గౌతమ్ గంభీర్ 16 సార్లు రనౌట్ కాగా, రైనా, అంబటి రాయుడు 15 సార్లు రనౌట్ అయ్యారు. ఆ తర్వాత శివమ్ దూబే కూడా ఆండ్రే రస్సెల్ బౌలింగ్లో అవుట్ కావడంతో 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది సీఎస్కే...
6 బంతుల్లో 3 పరుగులు చేసిన శివమ్ దూబే, ఆండ్రే రస్సెల్ బౌలింగ్లో సునీల్ నరైన్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు... ఎమ్మెస్ ధోనీ, రవీంద్ర జడేజా ఇద్దరూ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో 17 ఓవర్లు ముగిసే సమయానికి 84 పరుగులు మాత్రమే చేయగలిగింది సీఎస్కే. ఆండ్రే రస్సెల్ వేసిన 18వ ఓవర్లో 3 ఫోర్లతో 14 పరుగులు రాబట్టిన ఎమ్మెస్ ధోనీ, శివమ్ మావి వేసిన 19వ ఓవర్లో ఓ ఫోర్, సిక్సర్తో 15 పరుగులు రాబట్టాడు...
రస్సెల్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు బాది, కెరీర్లో 29వ హాఫ్ సెంచరీ అందుకున్నాడు ఎమ్మెస్ ధోనీ. 38 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్తో మహీ 50 పరుగులు చేయగా, కెప్టెన్గా తొలి మ్యాచ్ ఆడుతున్న రవీంద్ర జడేజా మాత్రం జిడ్డు బ్యాటింగ్తో 28 బంతుల్లో26 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్సర్ బాదాడు.
మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా కలిసి ఆరో వికెట్కి 56 బంతుల్లో 70 పరుగుల భాగస్వామ్యం జోడించారు.