ఆడింది నాలుగు బంతులే అయితేనేం... ఐపిఎల్ హిస్టరీలోనే అరుదైన రికార్డు పాండ్యా సొంతం

Arun Kumar P   | Asianet News
Published : Oct 05, 2020, 10:38 AM ISTUpdated : Oct 05, 2020, 10:49 AM IST
ఆడింది నాలుగు బంతులే అయితేనేం... ఐపిఎల్ హిస్టరీలోనే అరుదైన రికార్డు పాండ్యా సొంతం

సారాంశం

హైదరాబాద్ జట్టుపై ఆకాశమే హద్దుగా చెలరేగిన ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు.

దుబాయ్: సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా అరుదైన ఘనత సాధించాడు. ముంబై ఇన్సింగ్ చివర్లో కేవలం నాలుగుబంతులు మాత్రమే ఆడిన కృనాలు ఏకంగా 500కు పైగా స్ట్రైక్ రేట్ తో 20 పరుగులు చేశాడు. ఇలా ఐపిఎల్ లో కనీసం 10పరుగులు చేసిన ఆటగాళ్లలో 500 స్ట్రైక్ రేట్ కలిగిన తొలి బ్యాట్స్‌మన్‌గా కృనాల్ చరిత్ర సృష్టించాడు.  

ఈ మ్యాచ్ లో ముంబై మొదట బ్యాటింగ్ కు దిగగా చివరి ఓవర్ రెండో బంతికి హార్దిక్ పాండ్యా ఔటయ్యాడు. అయితే ఆ తర్వాత బరిలోకి దిగిన కృనాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిద్దార్ కౌల్ విసిరిన మొదటి బంతిని నేరుగా బౌండరీ అవతలికి తరలించి సిక్సర్ గా మలిచాడు. ఆ తర్వాతి రెండు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టాడు. ఇక మూడో బంతి సిక్స్ కొట్టి విజయవంతంగా ఇన్నింగ్స్ ముగించాడు. ఇలా క్రీజులో వున్న కొద్దిసేపట్లోనే పరుగుల సునామీ సృష్టించి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు కృనాల్. 
 

PREV
click me!

Recommended Stories

T20 World Cup ఫైనల్‌లో అభిషేక్ శర్మను ఆడిస్తారా? గంభీర్, సూర్యల ప్లానేంటి?
T20 World Cup 2026: భారత్ vs న్యూజిలాండ్ ఫైనల్ రద్దయితే విజేత ఎవరో తెలుసా?