2020 టైటిల్ స్పాన్సర్గా ‘డ్రీమ్ 11’...
తిరిగి ‘వీవో’ను ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా ప్రకటించిన ఐపీఎల్ ఛైర్మెన్...
ఐపీఎల్ 2021 సీజన్ 14 ఆటగాళ్ల వేలం ఘనంగా ప్రారంభమైంది. గత ఏడాది చైనా వస్తువులపై బ్యాన్ కారణంగా ‘డ్రీమ్ 11’ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్కి టైటిల్ స్పాన్సర్గా వ్యవహారించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ ఏడాది మళ్లీ చైనా మొబైల్ కంపెనీ ‘వీవో’ ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహారించనుంది. ఈ విషయాన్ని ఐపీఎల్ ఛైర్మెన్ బ్రీజేశ్ పటేల్ ధృవీకరించారు.
జనాలు లేకుండా ఖాళీ స్టేడియాల్లో 2020 సీజన్ను యూఏఈలో నిర్వహించిన బీసీసీఐ, ఈసారి ఐపీఎల్ 2021 సీజన్ను జనాల మధ్యలోనే నిర్వహించబోతున్నట్టు స్పష్టం చేసింది. ఐపీఎల్ 2021 టీవీ ప్రసారాలు కూడా స్టార్ స్పోర్ట్స్ ఛానెల్లోనే ప్రసారం అవుతాయని తెలిపాడు పటేల్.