ఐపీఎల్ 2023 సీజన్: లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్ సమయంలో మాహీ కనిపించగానే, టీవీకి హారతి ఇచ్చిన వీరాభిమాని... సోషల్ మీడియాలో వీడియో వైరల్...
సినిమా హీరోలకే కాదు, క్రికెటర్లకు కూడా వీరాభిమానులు, ఇంకా చెప్పాలంటే భక్తులు ఉంటారు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటే, మహేంద్ర సింగ్ ధోనీకి బీభత్సమైన మాస్ ఫాలోయింగ్ ఉంది... ఎక్కడో రాంఛీలో పుట్టి, టీమిండియా కెప్టెన్గా మారి... మూడు ఐసీసీ టైటిల్స్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీని ఆరాధ్య దైవంగా భావిస్తారు చాలామంది డై హార్డ్ ఫ్యాన్స్..
మాహీని చూడగానే కాళ్లపై పడిపోయే అభిమానులు ఎందరో. ఐపీఎల్ 2023 ఆరంభ వేడుకల సమయంలో బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్, ‘ఓం దేవా.. దేవా... నమః’ అని పాడుతుండగానే బిగ్ స్క్రీన్పై మాహీ కనిపించడం, స్టేడియంలో ఉన్న లక్ష మంది జనం.. ఒక్కసారిగా అరవడం అందరికీ గుర్తుండే ఉంటుంది..
తాజాగా ఐపీఎల్ 2023 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా టీవీలో మాహీ కనిపించగానే ఓ అభిమాని, టీవీకి హారతి ఇస్తూ గంట కొట్టాడు.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..
This is why Cricket is considered as Religion in India.🫶🏻pic.twitter.com/jjWLOecOCE
— Aayushi🏏 (@cric_aayushi)సినిమా హీరోల పోస్టర్లకు, కటౌట్లకు పాలాభిషేకాలు చేయడం, పూల మాలలు వేసి డప్పు చప్పుళ్లతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. అయితే ఓ క్రికెటర్కి, అది కూడా మూడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న క్రికెటర్కి ఇలా హారతి ఇచ్చి, తన పిచ్చి అభిమానాన్ని చాటుకోవడం హాట్ టాపిక్ అవుతోంది..
యూత్లో మాహీకి ఉన్న క్రేజ్కి ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ఐపీఎల్ 2022 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్, 10 మ్యాచుల్లో ఓడి 9వ స్థానానికి పరిమితమైంది. అయితే 2020 బ్యాడ్ సీజన్ తర్వాత 2021 టైటిల్ గెలిచింది సీఎస్కే. ఈసారి కూడా అలాంటి కమ్బ్యాక్ ఆశిస్తున్నారు ఫ్యాన్స్. 3 సీజన్ల తర్వాత తొలిసారిగా చెన్నైలో సొంత మైదానంలో మ్యాచులు ఆడుతోంది చెన్నై సూపర్ కింగ్స్...
మిగిలిన ఫ్రాంఛైజీలు ఆడే మ్యాచులకు సంబంధించిన టికెట్లు, ఇప్పటికీ అందుబాటులో ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ ఆడే మ్యాచులన్నీ బుకింగ్ ఓపెన్ చేసిన నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి..
ఐపీఎల్ 2023 సీజన్తో మహేంద్ర సింగ్ ధోనీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా తప్పుకుంటాడని తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. అయితే దీపక్ చాహార్, రోహిత్ శర్మ వంటి ప్లేయర్లు మాత్రం మాహీ, ఇంకో రెండు మూడు సీజన్లు ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశారు..
గుజరాత్ టైటాన్స్తో జరిగిన మొదటి మ్యాచ్లో ఆఖరి ఓవర్లో ఓ 6, 4 బాది అభిమానులను అలరించాడు మహేంద్ర సింగ్ ధోనీ.. మాహీ బ్యాటు నుంచి ఇలాంటి మెరుపులు ఎన్నో రావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. తొలి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతుల్లో ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్ని ఓడించి బోణీ కొట్టాలని చూస్తోంది.