IPL 2021 MI vs DC: అరుదైన రికార్డు చేరువలో హిట్ మ్యాన్.. నేటి మ్యాచ్ లో అది సాధిస్తే టీమ్ ఇండియాలో తోపు రోహితే

By team teluguFirst Published Oct 2, 2021, 2:00 PM IST
Highlights

Rohit Sharma: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. నేడు ఢిల్లీతో జరిగే మ్యాచ్ లో రెండు సిక్సర్లు కొడితే భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించనున్నాడు. 

ధనాధన్ క్రికెట్ లో అరుదైన మైలురాయిని సాధించేందుకు రోహిత్ శర్మ రెండు అడుగుల దూరంలో నిలిచాడు. ఐపీఎల్ 2021 లో భాగంగా నేడు జీవన్మరణ పోరు ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్  సారథి.. నేటి మ్యాచ్ లో ఆ రేర్ ఫీట్ ను సాధించాలని ఉవ్విళ్లూరుతున్నాడు.  ఈ మ్యాచ్ లో రెండు సిక్సర్లు కొడితే చాలు.. ఆ రికార్డు హిట్ మ్యాన్ సొంతం కానున్నది. 

రోహిత్ శర్మ మరో రెండు సిక్స్ లు కొడితే టీ20లలో 400 సిక్సర్లు కొట్టిన తొలి భారతీయ బ్యాట్స్మెన్ గా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రికార్డు సృష్టించనున్నాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ ఓపెనర్ క్రిస్ గేల్, కీరన్ పొలార్డ్, ఆండ్రూ రస్సెల్, ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ముందున్నారు. 

గేల్ ఖాతాలో 1002 సిక్సర్లు ఉండగా.. కీరన్ పొలార్డ్ (758), ఆండ్రూ రస్సెల్ (510) ముందు వరుసలో ఉన్నారు. వీరి తర్వాత కోల్కతా కోచ్  బ్రెండన్ మెక్ కల్లమ్ 485 సిక్సర్లు బాదగా.. వాట్సన్ 467 సిక్స్ లు కొట్టాడు. రోహిత్ ప్రస్తుతం మంచి ఫామ్ లోనే ఉన్నాడు. దీంతో ఈ మ్యచ్ లోనే హిట్ మ్యాన్ ఆ రేర్ ఫీట్ సాధిస్తాడని ముంబైతో పాటు ఐపీఎల్ అభిమానులు ఆశిస్తున్నారు. 

click me!