IPL 2020: తెలుగులో కామెంటేటర్‌గా ఎమ్మెస్కే ప్రసాద్...

Published : Sep 15, 2020, 01:53 PM IST
IPL 2020: తెలుగులో కామెంటేటర్‌గా ఎమ్మెస్కే ప్రసాద్...

సారాంశం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ సీజన్ ప్రారంభానికి ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. తాజాగా ఐపీఎల్ 2020 కోసం కామెంటరీ ప్యానెల్‌ను ప్రకటించింది బీసీసీఐ.   కరోనా కారణంగా దుబాయ్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్ కోసం ఇప్పటికే మెజారిటీ క్రికెటర్లు అక్కడికి చేరుకున్నారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ప్లేయర్లు బిజీగా ఉండడం వల్ల రెండు వారాల తర్వాత చేరతారు.

మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు సునీల్ గవాస్కర్, ఇయాన్ బిషప్, హర్షా బోగ్లే వంటి వారిని ఎంపిక చేసిన ఐపీఎల్ కమిటీ, సంజయ్ మంజ్రేకర్‌ని మాత్రం సెలక్ట్ చేయలేదు.

తెలుగులో మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ వ్యాఖ్యతగా వ్యవహారించబోతున్నారు. ఎమ్మెస్కేతో పాటు వెంకటపతి రాజు, వేణుగోపాల్ రావు, కళ్యాణ కృష్ణ, ఎం. ఆనంద్ శ్రీ కృష్ణ, నేహా మాచ, కౌశిక్ చక్రవర్తి, ఆశీష్ రెడ్డి కామెంటేటర్లుగా వ్యవహారిస్తారు. తమిళ్‌లో కృష్ణమాచారి శ్రీకాంత్ వ్యాఖ్యతగా వ్యవహారించబోతున్నారు.


ఇంగ్లీషులో సునీల్ గవాస్కర్, రోహన్ గవాస్కర్, దీప్ దస్‌గుప్తా, శివరామకృష్ణన్, హార్షా బోగ్లే, పీటర్సన్, డుమినీ, మురళీ కార్తీక్, హిందీలో సంజయ్ భంగర్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

IND vs IRE : ఐర్లాండ్ ల్యాండ్ షేకింగ్ విక్టరీ.. ఈ పసికూన చేతిలో టీమిండియా ఓటమికి టాప్ 5 రీజన్స్ ఇవే
T20 World Cup 2026: తెలుగమ్మాయి దెబ్బకు వరల్డ్ రికార్డులు బ్రేక్.. టీ20 వరల్డ్ కప్ లో దుమ్మురేపుతున్న శ్రీచరణి