
భారత జట్టు ఎక్కడికి వెళితే, అక్కడ వరుణుడు కూడా ప్రత్యక్షం అవుతుంటాడు. ఇంగ్లాండ్ టూర్లో టీమిండియాని బాగా విసిగించిన వర్షం, సౌతాఫ్రికా టూర్లోనూ ఇబ్బంది పెడుతోంది. సెంచూరియన్లో జరిగిన తొలి టెస్టులో వర్షం కారణంగా రెండో రోజు ఒక్క బంతి కూడా పడకుండానే ఆట రద్దయిన విషయం తెలిసిందే...
తాజాగా జోహన్బర్గ్లో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లోనూ వర్షం అంతరాయం కలిగిస్తోంది. రెండో టెస్టు మొదటి రోజు ఆట ప్రారంభానికి ముందు కొన్ని గంటల ముందు వర్షం పడింది. అయితే మ్యాచ్ సమయానికి వర్షం ఆగిపోవడం, పిచ్ ఆరిపోవడంతో ఆట ఎలాంటి అంతరాయం లేకుండా సాగింది...
తాజాగా నాలుగోరోజు వర్షం కారణంగా ఆట ఆలస్యం కానుంది. 240 పరుగుల టార్గెట్తో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలెట్టిన సౌతాఫ్రికా జట్టు, మూడో రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఓపెనర్ అయిడిన్ మార్క్రమ్ 38 బంతుల్లో 6 ఫోర్లతో 31 పరుగులు చేసి శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో అవుట్ కావడంతో 47 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిది సౌతాఫ్రికా...
ఆ తర్వాత డీన్ ఎల్గర్, కీగన్ పీటర్సన్ కలిసి రెండో వికెట్కి 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 44 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసిన కీగన్ పీటర్సన్ను రవిచంద్రన్ అశ్విన్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. 93 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది సఫారీ జట్టు...
సౌతాఫ్రికా విజయానికి ఇంకా 122 పరుగులు కావాలి... కెప్టెన్ డీన్ ఎల్గర్ 121 బంతుల్లో 2 ఫోర్లతో 46 పరుగులు చేసి, రస్సీ వాన్ దేర్ దుస్సేన్ 37 బంతుల్లో 11 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు...
భారత జట్టు విజయాన్ని అందుకోవాలంటే 8 వికెట్లు పడగొట్టాల్సి ఉంటుంది. తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు తీసిన శార్దూల్ ఠాకూర్, టెస్టు కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల పర్ఫామెన్స్ను అందుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లోనూ మొదటి వికెట్ శార్దూల్ ఠాకూర్కే దక్కింది...
జోహన్బర్గ్లో ఇప్పటిదాకా ఆరు టెస్టులు ఆడిన భారత జట్టు, ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోలేదు. రెండు మ్యాచుల్లో విజయాలను అందుకున్న టీమిండియా, మిగిలిన మ్యాచులను డ్రాగా చేసుకుంది. అయితే రెండో టెస్టులో గెలవాలంటే భారత బౌలర్లు అద్భుతం చేయాల్సిందే...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, తొలి ఇన్నింగ్స్లో 202 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సౌతాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్లో 229 పరుగులు చేయడంతో ఆతిథ్య జట్టుకి 27 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. ఈ 27 పరుగులే ఇప్పుడు మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించబోతున్నాయి...
రెండో ఇన్నింగ్స్లో అజింకా రహానే 78 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్తో 58 పరుగులు, ఛతేశ్వర్ పూజారా 86 బంతుల్లో 10 ఫోర్లతో 53 పరుగులు చేసి అవుట్ కాగా ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన హనుమ విహారి 84 బంతుల్లో 6 ఫోర్లతో 40 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.