సానియా మీర్జా అంటే ప్రేమ లేదన్న షోయబ్ మాలిక్... భారత టెన్నిస్ స్టార్ రియాక్షన్ ఏంటంటే...

By Chinthakindhi RamuFirst Published Jan 6, 2022, 2:08 PM IST
Highlights

భర్త షోయబ్ మాలిక్‌‌తో ఫన్నీ వీడియో షేర్ చేసిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా... దుబాయ్‌లో విహర యాత్రలో సెలబ్రిటీ కపుల్...

పాకిస్తాక్ క్రికెటర్లంటే భారతీయులకు అస్సలు పడదు. అయితే అంతో కొంతో భారతీయులు ప్రేమాభిమానులు చురగొన్న పాక్ క్రికెటర్ ఎవరైనా ఉన్నారంటే అది షోయబ్ మాలిక్. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాని పెళ్లాడక ముందే, భారత క్రికెటర్లతో సన్నిహితంగా ఉండేవాడు షోయబ్ మాలిక్... భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాని ప్రేమించి, పెళ్లాడిన షోయబ్ మాలిక్, ఇప్పుడు భార్యంటే తనకి ఏ మాత్రం ఇష్టం లేదని అంటున్నాడు.

అది కూడా ఆమె ముందే, ఆమెతోనే... అవును... ఇది నిజంగా నిజం! వాళ్లిద్దరి మధ్య ఏం గొడవలు వచ్చాయో అని కంగారుపడకండి... ఇదంతా సరదాకే! కొన్నాళ్లుగా ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కి దూరం కావడంతో సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్‌గా ఉంటున్న సానియా మీర్జా, తన భర్త షోయబ్ మాలిక్‌తో కలిసి చేసిన ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది...

‘నేను నిన్ను ప్రేమించడం లేదు... ’ అని షోయబ్ మాలిక్ హిందీలో అంటే... దానికి సానియా మీర్జా... ‘అది నీకే నష్టం... నాకే పోదు...’ అంటూ కొట్టిపారేస్తూ పాట అందుకుంది... ఈ వీడియోకి ‘నీకే నష్టం బడ్డీ...’ అంటూ కాప్షన్ కూడా ఇచ్చింది సానియా మీర్జా... 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sania Mirza (@mirzasaniar)

39 ఏళ్ల వయసులోనూ 23 ఏళ్లుగా క్రికెట్‌లో కొనసాగుతున్న షోయబ్ మాలిక్, టీ20ల్లో 10 వేల పరుగులు చేసిన మొట్టమొదటి పాకిస్తాన్ క్రికెటర్‌గా ఉన్నాడు. 

పాకిస్తాన్ జట్టుకి కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన షోయబ్ మాలిక్, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 బంతుల్లో 54 పరుగులు చేసి తనలో ఇంకా సత్తా చావలేదని నిరూపించుకున్నాడు. 18 బంతుల్లో ఓ ఫోర్, 6 సిక్సర్లతో సిక్సర్ల వర్షం కురిపించిన షోయబ్ మాలిక్, ఆ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు...

ఓ బిడ్డకు తల్లైన తర్వాత ఏడాదిన్నరకు పైగా టెన్నిస్ నుంచి బ్రేక్ తీసుకున్న సానియా మీర్జా మాలిక్, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో టీమిండియా తరుపున ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొన్న సానియా మీర్జా గాయంతో తప్పుకోగా, టోక్యో ఒలింపిక్స్‌లో రెండో రౌండ్‌లో ఉక్రెయిన్ చేతుల్లో ఓడింది భారత డబుల్స్ జోడి...

టెన్నిస్ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్)లో బెంగళూరు స్పార్టన్స్‌ అనే జట్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది సానియా మీర్జా. 2021 టీపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది బెంగళూరు స్పార్టన్స్ టీమ్. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లతో సిరీస్‌లు ఆడిన పాకిస్తాన్ జట్టు... ప్రస్తుతం ఖాళీగా ఉంది. దీంతో ఖాళీ సమయాన్ని భార్య, కొడుకుతో కలిసి గడుపుతున్నాడు షోయబ్ మాలిక్...

పెళ్లైన తర్వాత యూఏఈకి మకాం మార్చిన షోయబ్ మాలిక్, సానియా మీర్జా జంట ప్రస్తుతం అక్కడే ఉంటోంది. బంగ్లాదేశ్‌తో టీ20సిరీస్ సమయంలో కొడుకు ఇజాన్‌కి జ్వరం రావడంతో ఆఖరి మ్యాచ్ నుంచి తప్పుకుంటూ  నిర్ణయం తీసుకున్నాడు షోయబ్ మాలిక్...
 

click me!