ఢిల్లీ క్యాపిటల్స్ లో కరోనా కలవరం

Published : Sep 07, 2020, 11:37 AM ISTUpdated : Sep 07, 2020, 11:44 AM IST
ఢిల్లీ క్యాపిటల్స్ లో కరోనా కలవరం

సారాంశం

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు అసిస్టెంట్‌ ఫిజియోథెరపిస్ట్‌ కరోనా బారిన పడ్డాడు. దుబాయ్‌కు చేరుకున్నాక అతనికి నిర్వహించిన తొలి రెండు కోవిడ్‌–19 పరీక్షలు నెగెటివ్‌ రాగా... మూడో పరీక్షలో మాత్రం అతనికి పాజిటివ్‌ వచ్చిందని ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఆదివారం తమ అధికారిక ప్రకటనలో తెలిపింది.

క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 త్వరలో ప్రారంభం కానుంది. కాగా.. ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాకముందే ఆటంకాలు మొదలౌతున్నాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కరోనా వైరస్ కలకలం మొదలైంది. తాజాగా..  ఇదే సమస్య ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ కి వచ్చి పడింది.

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు అసిస్టెంట్‌ ఫిజియోథెరపిస్ట్‌ కరోనా బారిన పడ్డాడు. దుబాయ్‌కు చేరుకున్నాక అతనికి నిర్వహించిన తొలి రెండు కోవిడ్‌–19 పరీక్షలు నెగెటివ్‌ రాగా... మూడో పరీక్షలో మాత్రం అతనికి పాజిటివ్‌ వచ్చిందని ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఆదివారం తమ అధికారిక ప్రకటనలో తెలిపింది.

అయితే కరోనా సోకిన ఫిజియోథెరపిస్ట్‌ ఇప్పటి వరకు జట్టు సభ్యులతో, ఫ్రాంచైజీ అధికారులతో కలవలేదని... అతను నిబంధనల ప్రకారం దుబాయ్‌లోని ఐపీఎల్‌ ఐసోలేషన్‌ కేంద్రంలో 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంటాడని ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం తెలిపింది. ఐపీఎల్‌లో ఆడేందుకు వచ్చిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు చెందిన 13 మంది వ్యక్తులకు, బీసీసీఐ మెడికల్‌ జట్టులోని సభ్యుడికి కరోనా సోకింది

PREV
click me!

Recommended Stories

Lalit Modi: డైమండ్స్ క్వీన్.. సుస్మితా సేన్ సీక్రెట్ లవ్ స్టోరీ బయటపెట్టిన లలిత్ మోదీ !
Team India Schedule: ఐపీఎల్ అయిపోయింది.. అసలు ఆట ఇప్పుడే మొదలైంది! 2027 వరల్డ్ కప్ దాకా భారత్‌కు నో రెస్ట్