
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో 158 పరుగుల టార్గెట్తో బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, 95 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ ధనాధన్ ఇన్నింగ్స్తో భారత స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది...
19 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేసిన రోహిత్ శర్మ, వెస్టిండీస్పై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా రికార్డు క్రియేట్ చేశాడు. తొలి టీ20లో 40 పరుగులు చేసిన రోహిత్, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్మెన్గా నిలిచాడు...
పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్, వెస్టిండీస్పై టీ20ల్లో 540 పరుగులు చేయగా... రోహిత్ శర్మ 543 పరుగులతో టాప్లో నిలిచాడు. విరాట్ కోహ్లీ 501 పరుగులు చేసి టాప్ 3లో ఉన్నాడు.
64 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. ఆ తర్వాత ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్కి 29 పరుగులు జోడించారు. 42 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, రోస్టన్ ఛేజ్ బౌలింగ్లో ఫ్యాబియన్ ఆలెన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
13 బంతుల్లో ఓ ఫోర్తో 17 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఫ్యాబియన్ ఆలెన్ బౌలింగ్లో కిరన్ పోలార్డ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వరుసగా మూడు టీ20 ఇన్నింగ్స్ల్లో 30+ స్కోరు కూడా దాటలేకపోవడం నాలుగేళ్లలో ఇదే తొలిసారి...
17 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్మెన్గా తన రికార్డును తిరిగి తెచ్చుకున్నాడు. రిషబ్ పంత్ 8 పరుగులు చేసి కాట్రెల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 114 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది భారత జట్టు...
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగలిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ మొదలెట్టిన విండీస్కి మొదటి ఓవర్లోనే షాక్ తగిలింది... 4 పరుగులు చేసిన బ్రెండన్ కింగ్ని భువనేశ్వర్ కుమార్ అవుట్ చేశాడు. 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది వెస్టిండీస్. కేల్ మేయర్స్ 24 బంతుల్లో 7 ఫోర్లతో 31 పరుగులు చేశాడు.
రోస్టన్ ఛేజ్ 10 బంతుల్లో 4 పరుగులు చేసిన ఆరంగ్రేట బౌలర్ రవి భిష్ణోయ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. రోవ్మన్ పావెల్ 2 పరుగులు చేసి రవి భిష్ణోయ్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. 12 బంతుల్లో ఓ సిక్సర్తో 10 పరుగులు చేసిన అకీల్ హుస్సేన్, దీపక్ చాహార్ బౌలింగ్లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
14 ఓవర్లు ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 90 పరుగులు మాత్రమే చేయగలిగింది వెస్టిండీస్. యజ్వేంద్ర చాహాల్ వేసిన 15వ ఓవర్లో 2 పరుగులు మాత్రమే రాగా, 16వ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత చాహాల్ వేసిన ఆఖరి ఓవర్లో ఏకంగా 17 పరుగులు రాబట్టారు పూరన్, పోలార్డ్...
హర్షల్ పటేల్ బౌలింగ్లో భారీ సిక్సర్ బాదిన నికోలస్ పూరన్, ఆఖరి బంతికి విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 19వ ఓవర్లో సిక్సర్ బాదిన విండీస్ కెప్టెన్ కిరన్ పోలార్డ్ 12 పరుగులు రాబట్టాడు...
4 బంతుల్లో 4 పరుగులు చేసిన ఓడియన్ స్మిత్, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. విండీస్ కెప్టెన్ కిరన్ పోలార్డ్ 19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్తో 24 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు...
ఆరంగ్రేట మ్యాచ్ ఆడుతున్న యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్ 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి సీనియర్ల కంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. రవి భిష్ణోయ్ మినహా మిగిలిన భారత బౌలర్లు అందరూ 7కి రన్ రేట్తో పరుగులు సమర్పించారు. ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఒక్క ఓవర్ బౌలింగ్ చేసి 4 పరుగులు మాత్రమే ఇచ్చినా, మళ్లీ అతనికి మరో ఓవర్ వేసే అవకాశం దక్కలేదు కెప్టెన్ రోహిత్ శర్మ...
ఆఖరి 5 ఓవర్లలో 65 పరుగులు చేసింది వెస్టిండీస్ జట్టు. భారత బౌలర్లలో హర్షల్ పటేల్, రవి భిష్ణోయ్ రెండేసి వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహార్, యజ్వేంద్ర చాహాల్లకి తలా ఓ వికెట్ దక్కింది.
ఐపీఎల్ 2022 వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.7.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన విండీస్ ఆల్రౌండర్ రొమారియో షెఫర్డ్, 7 వికెట్లు పడిన తర్వాత కూడా క్రీజులోకి రాకపోవడం విశేషం...