ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు... అతిథులుగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్...

Published : Feb 22, 2021, 07:36 PM IST
ఇంగ్లాండ్‌తో మూడో టెస్టు... అతిథులుగా ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్...

సారాంశం

ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం కలిగిన స్టేడియంగా మొతేరా స్టేడియం... 10 ఏళ్ల తర్వాత మొతేరా స్టేడియంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్... మొతేరా స్టేడియం ప్రారంభ మ్యాచ్‌కి భారీగా ఏర్పాట్లు చేస్తున్న బీసీసీఐ...

ఇంగ్లాండ్‌తో మొతేరా స్టేడియం వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టుకి ముఖ్య అతిథులుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హాజరుకాబోతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం కలిగిన స్టేడియంగా, అత్యాధునిక వసతులతో మొతేరా సర్దార్ వల్లభాయ్ స్టేడియాన్ని పునర్మించిన విషయం తెలిసిందే...

దాదాపు 10 ఏళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కాబోతున్న మొతేరా స్టేడియంలో జరుగనున్న ఈ మ్యాచ్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ. మ్యాచ్ ప్రారంభానికి వచ్చేయాల్సిందిగా భారత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు కూడా ఆహ్వానం పంపినట్టు సమాచారం.

బిజీ షెడ్యూల్ కారణంగా ప్రధాని రాక గురించి ఇంకా క్లారిటీ రాకపోయినా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మూడో టెస్టు ఆరంభవేడుకలకు హాజరు అవుతారని సమాచారం. రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు అమిత్ షా, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, బీసీసీఐ సెక్రటరీ జే షా ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

IPL : సన్‌రైజర్స్ హైదరాబాద్ గూటికి విధ్వంసకర వీరుడు.. 2026 ఐపీఎల్ కోసం కొత్త సైన్యం రెడీ !
IPL 2026 : కోట్లు కుమ్మరించిన సీఎస్కే ! ఎవరీ కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్?