ఒకటి రెండు సార్లు పరుగులు వచ్చినా.. ఆ తర్వాత వెంటనే ఔటైపోతున్నారు. ఇదే విషయాన్ని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొనడం విశేషం.
ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ లో.. రెండో టెస్టు మ్యాచ్ భారత్ కైవసం అయ్యింది. దీంతో.. అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. అయితే.. ఈ టెస్టు సిరీస్ లో.. రోహిత్ శర్మ ఆట మాత్రం తనను తీవ్రంగా నిరాశ పరిచిందని సీనియర్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. రోహిత్ తన ఫామ్ ని కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంగ్లాండ్ క్రికెటర్లు పన్నిన వలలో రోహిత్ చాలా సులభంగా చిక్కుకున్నాడంటూ పేర్కొనడం గమనార్హం.
టెస్టు మ్యాచ్ లో భాగంగా రెండో ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ ఔటైన కాసేపటికే రోహిత్ శర్మ కూడా వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ పేసర్లు ఉద్దేశపూర్వకంగా వేసిన షార్ట్ పిచ్ బాల్ ను రోహిత్ భారీ షాట్లు ఆడుతున్నాడు. ఒకటి రెండు సార్లు పరుగులు వచ్చినా.. ఆ తర్వాత వెంటనే ఔటైపోతున్నారు. ఇదే విషయాన్ని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొనడం విశేషం.
రోహిత్ శర్మ తనను తాను తక్కువ చేసుకుంటున్నాడన్నారు. నాటింగ్ హామ్ టెస్టులోనూ అతను ఇదే తరహాలో ఔటయ్యాడని గుర్తు చేశారు. కొన్నిసార్లు మనకు ఇష్టమైన షాటే కొంప ముంచుతుందన్నారు. రోహిత్ సిక్స్ కొట్టిన ఓవర్ లోనే ప్రత్యర్థి కెప్టెన్ ఫీల్డింగ్ లో మార్పులు చేశాడని.. రోహిత్ తో భారీ షాట్స్ ఆడేంచేలా ప్లాన్ చేసి మరీ ఔట్ చేశారని లక్ష్మణ్ పేర్కొన్నాడు. వాళ్లు వల వేస్తున్నారనే విషయం రోహిత్ అర్థం చేసుకోవడం లేదు అని అన్నారు. రోహిత్ అలా భారీ షాట్స్ ఆడకుండా ఉండాల్సిందని వీవీ ఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు.