INDvsENG 2nd Test: ఒక్క పరుగుకే రెండు వికెట్లు... రసవత్తరంగా మారిన లార్డ్స్ టెస్టు...

Published : Aug 16, 2021, 06:49 PM IST
INDvsENG 2nd Test: ఒక్క పరుగుకే రెండు వికెట్లు... రసవత్తరంగా మారిన లార్డ్స్ టెస్టు...

సారాంశం

ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్... ఇంగ్లాండ్ ఓపెనర్లను డకౌట్ చేసిన బుమ్రా, షమీ... ఇంకా 269 పరుగుల దూరంలో ఇంగ్లాండ్...

లార్డ్స్ టెస్టు క్రికెట్ ఫ్యాన్స్‌కి కావల్సినంత మజాను అందిస్తోంది. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 298/8 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా... 271 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఇంగ్లాండ్ ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది...

తొలి ఓవర్‌లో రోరీ బర్న్స్‌ను డకౌట్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా... ఆ తర్వాతి ఓవర్‌లో డొమినిక్ సిబ్లీని మహ్మద్ షమీ అవుట్ చేశాడు. ఇంగ్లాండ్‌కి వచ్చిన ఆ ఒక్క పరుగూ నో బాల్ రూపంలో ఎక్స్‌ట్రాగా రావడం విశేషం. బ్యాటింగ్‌తో అదరగొట్టి, భారత జట్టుకి భారీ ఆధిక్యాన్ని అందించిన బుమ్రా, షమీ... ఆ వెంటనే బాల్‌తోనూ ఇంగ్లాండ్‌కి చుక్కలు చూపిస్తుండడం విశేషం.. 

బుమ్రాపైకి బౌన్సర్లు విసిరి, రెచ్చగొట్టిన ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలనే కసి... భారత జట్టు ప్లేయర్లలో స్పష్టంగా కనిపిస్తోంది. దాన్ని ప్రతిబింబించేలా ప్రతీ బంతీ, ఇంగ్లాండ్ జట్టు అహాన్ని దెబ్బతీసేలా సంధిస్తోంది భారత జట్టు...

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు