Suryakumar Yadav: 'ఆ విషయాన్ని డ్రెస్సింగ్ రూమ్‌లో వదిలేశా.. బ్యాటింగ్‌ను ఆస్వాదించా..' 

Published : Nov 24, 2023, 03:43 AM IST
Suryakumar Yadav: 'ఆ విషయాన్ని డ్రెస్సింగ్ రూమ్‌లో వదిలేశా.. బ్యాటింగ్‌ను ఆస్వాదించా..' 

సారాంశం

Suryakumar Yadav:విశాఖపట్నం వేదికగా భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య T20 సిరీస్ మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో  ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. కాగా, 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా మరో బంతి మిగిలి ఉండగానే 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ విజయంపై సూర్యకుమార్ యాదవ్ ఏం చెప్పారో తెలుసుకుందాం?

Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా శుభారంభం చేసింది. నవంబర్ 23న విశాఖపట్నంలో ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసి 2 వికెట్ల తేడాతో ఆసీస్ జట్టును ఓడించారు. భారత్ మ్యాచ్ గెలిచిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చాలా సంతోషంగా కనిపించాడు. ఆటగాళ్లను ప్రశంసించాడు. 

మ్యాచ్ అనంతరం జరిగిన వేడుకలో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఆటగాళ్ల ప్రదర్శన పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని, వారిని చూసి చాలా గర్వపడుతున్నానని చెప్పాడు. ‘‘ఆటగాళ్లు ఆడిన తీరు పట్ల చాలా సంతోషంగా ఉంది. మేము ఒత్తిడిలో ఉన్నాము, కానీ ప్రతి ఒక్కరూ ప్రదర్శించిన విధానం అద్భుతంగా ఉంది. ఇది చాలా గర్వించదగిన విషయం. మీరు ఎప్పుడు ఆడినా భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం గురించి ఆలోచిస్తారు. ఇంత దూరం వచ్చి భారత్‌కు కెప్టెన్‌గా నిలవడం గొప్ప తరుణం. కాస్త మంచు కురుస్తుందని అనుకున్నా అది జరగలేదు. ఇది పెద్ద మైదానం కాదు. బ్యాటింగ్ చేయడం సులభం అని నాకు తెలుసు. అని అన్నారు.

 బౌలర్లపై ప్రశంసలు 
 

భారత బౌలర్లు అద్భుతంగా రాణించారని, దీంతో కంగారూ జట్టు 208 పరుగులు మాత్రమే చేయగలిగిందని సూర్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా జట్టు 230-235 పరుగులు చేస్తుందని అనుకున్నా.. కానీ బౌలర్లు బాగా రాణించారని అన్నారు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో చాలాసార్లు అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాము. ఇషాన్‌ను ఆనందించమని చెప్పాము. ఏం జరగబోతోందో మాకు తెలుసు. కెప్టెన్సీ విషయాన్ని డ్రెస్సింగ్ రూమ్‌లో వదిలేశాను. నా బ్యాటింగ్‌ను ఆస్వాదించడానికి ప్రయత్నిస్తాను. వాతావరణం అద్భుతంగా ఉంది, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. 

అబ్బాయిలు తమ సహనాన్ని ఎలా కాపాడుకున్నారో చూడటం చాలా బాగుంది. దీంతో పాటు రింకూ సింగ్ ఇన్నింగ్స్ పట్ల కూడా చాలా బాగుందని అన్నారు. రింకూ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చినప్పటి నుంచి రాణిస్తున్నాడు, ఇదే అతని స్పెషాలిటీ. అతను ప్రశాంతంగా ఆడుతాడు. ఈ విషయం నన్ను కొంచెం శాంతింపజేసింది. ముఖేష్ కుమార్ కూడా చివరి ఓవర్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 16వ ఓవర్ తర్వాత వారిని ఈ స్కోరుకే పరిమితం చేయడం బౌలర్ల అద్భుత విజయమని అన్నారు. ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

PREV
click me!

Recommended Stories

IND vs SA: టీమిండియాకు తలనొప్పిగా మారిన స్టార్ ప్లేయర్ !
IND vs SA : టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలివే.. గంభీర్ దెబ్బ !