మహిళల ప్రపంచకప్: టాస్ గెలిచిన వెస్టిండీస్.. భారత్ బౌలింగ్

Published : Feb 15, 2023, 06:26 PM IST
మహిళల ప్రపంచకప్: టాస్ గెలిచిన వెస్టిండీస్.. భారత్ బౌలింగ్

సారాంశం

ICC Womens T20 World Cup 2023: మహిళల ప్రపంచకప్ లో భాగంగా  భారత్  - వెస్టిండీస్  మధ్య జరుగుతున్న  మ్యాచ్ లో   విండీస్ అమ్మాయిలు టాస్ గెలిచి తొలుత  బ్యాటింగ్ కు రానున్నారు. 

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న  ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ లో  భాగంగా  భారత్ - వెస్టిండీస్  మధ్య జరుగుతున్న మ్యాచ్ లో  కరేబియన్ మహిళల టీమ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.  పాకిస్తాన్  తో తొలి మ్యాచ్ లో గెలిచిన  భారత్.. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి  టోర్నీలో ముందడుగు వేయాలని భావిస్తున్నది. దకాగా తమ తొలి మ్యాచ్ లో వెస్టిండీస్.. ఇంగ్లాండ్ చేతిలో ఓడింది. 

కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో  విండీస్ సారథి హీలి మాథ్యూస్ టాస్ గెలిచి బ్యాటింగ్ కు రానుంది.   ఈ మ్యాచ్ లో కూడా ఓడితే ఆ జట్టు ఇక ప్రపంచకప్ మీద ఆశలు వదులుకోవాల్సిందే.   

గత మ్యాచ్ లో  గాయం కారణంగా జట్టుకు దూరమైన స్మృతి  మంధాన  ఈ మ్యాచ్ లో ఆడనుంది.  పేసర్ దేవిక వైధ్య కూడా  తిరిగి టీమ్ లోకి రానుంది.  

తుది జట్లు : 

ఇండియా : స్మృతి మంధాన,  షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్, దీప్తి శర్మ, పూజా వస్త్రకార్, దేవికా వైద్య, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్

వెస్టిండీస్ : హీలి మాథ్యూస్ (కెప్టెన్), స్టెఫానీ  టేలర్, షామైన్ క్యాంప్‌బెల్, షబికా గజ్నబి,   హెన్రీ,  చెడీన్ నేషన్, ఫ్లెచర్, షమిలియా కొనెల్, రషద విలియమ్స్, కరిష్మ రమ్హరాక్, షకీరా సెల్మన్ 
 

PREV
click me!

Recommended Stories

Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !
SMAT 2025: పరుగుల సునామీ.. ఎవడ్రా వీడు అభిషేక్, ఆయుష్‌లను దాటేశాడు !