కేవలం క్రికెటర్లు మాత్రమే కాకుండా.. వారి ఫ్యామిలీలు కూడా రావొచ్చంటూ అనుమతి ఇవ్వడంతో.. క్రికెటర్లు.. తమ కుటుంబంతో సహా.. అక్కడకు చేరుకుంటున్నారు. వారిలో.. ఛటేశ్వర పూజారా కూడా ఉన్నారు.
ఐపీఎల్ సీజన్ వాయిదా పడింది. కరోనా మహమ్మారి కారణంగా.. మధ్యలోనే సీజన్ ని ఆపేయాల్సి వచ్చింది. దీంతో.. ఇండియన్ క్రికెటర్లంతా.. ఇళ్లకే పరిమితయ్యారు. కాగా.. ఈ నేపథ్యంలో.. త్వరలో వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. కొందరు క్రికెటర్లు ఇప్పటికే ఇంగ్లాండ్ చేరకున్నారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో.. కొద్దిరోజులు వారు క్వారంటైన్ లోనే ఉండాల్సి ఉంటుంది. కేవలం క్రికెటర్లు మాత్రమే కాకుండా.. వారి ఫ్యామిలీలు కూడా రావొచ్చంటూ అనుమతి ఇవ్వడంతో.. క్రికెటర్లు.. తమ కుటుంబంతో సహా.. అక్కడకు చేరుకుంటున్నారు. వారిలో.. ఛటేశ్వర పూజారా కూడా ఉన్నారు.
ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న ఆయన.. ఆ సమయాన్ని తన కూతురికి కేటాయిస్తున్నారు. తన కూతురు అదితి తో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన తన సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దానికి క్యాప్షన్ గా.. క్వారంటైన్ డాడీ డ్యూటీస్ అని పెట్టడం విశేషం. ఆ ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
ఇదిలా ఉండగా.. ఈ టెస్టు ఛాంపియన్ షిప్ కోసం.. భారత్... న్యూజిలాండ్ తో తలపడనుంది. జూన్ 24వ తేదీ నుంచి ఈ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత 20 రోజుల గ్యాప్ తర్వాత... ఇంగ్లాండ్ తో జులై 14 నుంచి తలపడనున్నారు.