ICC Champions Trophy 2025 : IND vs NZ ఫైనల్ మ్యాచ్ ... ఏ టీం ఎలా ఉందో తెలుసా?

Published : Mar 07, 2025, 06:31 PM IST
ICC Champions Trophy 2025 : IND vs NZ ఫైనల్ మ్యాచ్ ... ఏ టీం ఎలా ఉందో తెలుసా?

సారాంశం

ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్ తో తలపడనుంది. ఈ క్రమంలో ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయి? ఎవరికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయో చూద్దాం. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను అలరించేందుకు భారత్, న్యూజిలాండ్ ఆటగాళ్లు సిద్దమయ్యారు.  ఐసిసి ఛాంపియన్ ట్రోఫీ 2025  లో ఇప్పటికే అద్భుతంగా ఆటతీరుతో ఫైనల్ కు చేరుకున్న ఇరుజట్లు టైటిల్ కు కేవలం అడుగుదూరంలో నిలిచాయి. ఆసక్లికరమైన విషయం ఏంటంటే 25 ఏళ్ల తర్వాత భారత్-న్యూజిలాండ్ జట్లు ఒక వైట్ బాల్ టోర్నమెంట్ ఫైనల్‌లో తలపడబోతున్నాయి. దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించి న్యూజిలాండ్ ఫైనల్‌కి చేరగా, ఆసీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి టీమిండియా ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది.

ఈ రెండు జట్లు చివరిసారిగా 2000 లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తలపడ్డాయి. అయితే అప్పుడు న్యూజిలాండ్ విజయం సాధించి తొలి ఐసిసి టైటిల్ అందుకుంది. అయితే సరిగ్గా 25 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ఐసిసి ఛాపింయన్స్ ట్రోఫీలో ఇండియా, న్యూజిలాండ్ తలపడుతున్నాయి... మరి   ఈసారి భారత్ రివేంజ్ తీర్చుకుంటుందా? లేక మరోసారి కివీస్ విజేతగా నిలిచిపోతారా? అనేది వచ్చే ఆదివారం తేలిపోనుంది. ఉత్కంఠ నెలకొన్న ఈ మ్యాచ్ ను మరింత అనుభూతి పొందుతూ మీరు గెలిచే చాన్స్ పొందాలంటే zuplay.com లో రిజిస్టర్ చేసుకోండి!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ వివరాలు :

తేదీ: మార్చి 9, 2025, ఆదివారం
సమయం: మధ్యాహ్నం 2:30 (IST)
వేదిక: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం

బలమైన జట్లమధ్య ఫైనల్ పోరు ... ఎలా ఉండనుందంటే : 

ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఇది... కాబట్టి ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ రసవత్తంగా ఉండనుంది. ఇటు భారత్, అటు న్యూజిలాండ్ జట్ల టాప్ క్లాస్ ఆటను ఇక్కడ చూడవచ్చు. ఇలా అత్యుత్తమ బ్యాటింగ్, అదేస్థాయి బౌలింగ్ కలిగిన జట్ల మధ్య మ్యాచ్ లో కీలక అంశాలను ఓసారి పరిశీలిద్దాం. 

1. న్యూజిలాండ్ పవర్ ఫుల్ బ్యాటింగ్ : 

న్యూజిలాండ్ బ్యాటింగ్ ధాటిని భారత బౌలర్లు నిలువరించగలరా అన్నది ఇక్కడ కీలకంగా మారింది. ముఖ్యంగా కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర అద్భుత ఫామ్‌లో ఉన్నారు. వారు న్యూజిలాండ్ బ్యాంటింగ్ కు బ్యాక్ బోన్ లా మారారు. ఇక గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్ మిడిల్ ఓవర్స్ లో రెచ్చిపోతున్నారు. దీంతో తరచూ 300+ పరుగులు సాధిస్తోంది... అంతటి లక్ష్యాన్ని కూడా ఈజీగా చేధించగలమనే నమ్మకంతో ఉంది.   
 
కీవీస్ ప్రధాన బలం: ఒత్తిడితో ఉన్నా పెద్ద లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఈ జట్టు ప్రధాన బలం. ఇదే ఆ జట్టును  ప్రత్యర్థులు భయపడేలా చేస్తోంది.  

2. ఇండియా టాప్ ఆర్డర్ దూకుడు : 

టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ ఆరంభంలోనే అదరగొడుతున్నారు.ఇద్దరూ దూకుడుగా ఆడుతూ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందిస్తున్నారు. ఇక మిడిల్ ఆర్డర్ లో చేస్ మాస్టర్ విరాట్ కోహ్లీ ఉండనే ఉన్నాడు. ఇండియన్ బ్యాటింగ్ విభాగానికి అతడు వెన్నెముకలా మారాడు. అలాగే శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ నిలకడగా ఆడుతూ మంచి పరుగులు సాధిస్తున్నారు. ఇలా భారత టాప్, మిడిల్ ఆర్డర్ అదరగొడుతోంది.  

టీమిండియా ప్రధాన బలం : ఈ టోర్నమెంట్ లో అన్ని జట్లకన్నా భారత టాప్ ఆర్డర్ అద్భుతంగా ఉంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మ్యాచ్ మలుపు తిప్పగల సామర్థ్యం భారత ఆటగాళ్లలో ఉంది. 

స్పిన్ vs పేస్ యుద్దం – ఎవరి బౌలింగ్ పైచేయి సాధిస్తుందో?

భారత స్పిన్ దళం : రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ వంటి స్పిన్నర్లతో భారత్ బలంగా ఉంది. దుబాయ్ స్టేడియంలో భారత స్పిన్నర్లు అదరగొడుతున్నారు.

న్యూజిలాండ్ స్పిన్ దళం : మిచెల్ సాంట్నర్, మైకేల్ బ్రేస్‌వెల్, రచిన్ రవీంద్ర  లతో కివీస్ స్పిన్ బౌలింగ్ కూడా బలంగానే ఉంది.

పేస్ విభాగం : భారత్‌కి వరల్డ్ క్లాస్ సీమర్స్ మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా ఉన్నారు. అదే కివీస్‌కి కైల్ జేమిసన్, మ్యాట్ హెన్రీ వంటి అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. వీరిలో ఎవరిది పైచేయిగా నిలుస్తుందో చూడాలి. 

దుబాయ్ మైదానంలో స్లో పిచ్ తయారుచేసారు... కాబట్టి ఇది స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి స్పిన్ విభాగంలో కివీస్ కంటే కాస్త ఎక్కువ బలంగా ఉన్న ఇండియాకు ఇది కలిసివస్తుంది. 

దుబాయ్ పిచ్ ఎలా ఉంటుంది : 

దుబాయ్ పిచ్ బ్యాటింగ్ కంటే బౌలింగ్ కు ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది... ఇప్పటివరకు ఇక్కడ జరిగిన మ్యాచుల్లో నమోదైన స్కోర్స్ ను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఇక్కడ సగటు స్కోరు 240-260 మాత్రమే. గ్రూప్ దశలో ఇండియా న్యూజిలాండ్ ను 250 పరుగుల లక్ష్యాన్ని కూడా చేధించకుండా నిలువరించింది... 205 పరుగులకే కుప్పకూల్చింది. 

లీగ్ మ్యాచ్ లో మాదిరిగానే భారత్ ముందు బ్యాటింగ్ చేసి మంచి స్కోర్ చేయగలిగితే మళ్ళీ న్యూజిలాండ్‌కు కష్టాలు తప్పకపోవచ్చు. ముఖ్యంగా భారత స్పిన్నర్లు మరోసారి చెలరేగవచ్చు. 

ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత ఎవరు?

భారత్ : భారత్ ఒత్తిడిని తట్టుకుని చాలా బాగా ఆడుతుంది. ఇదే యాటిట్యూడ్ కొనసాగిస్తూ బ్యాటింగ్, స్పిన్ అటాక్ తో అదరగొడితే విజయం ఇండియాదే.

న్యూజిలాండ్ : స్ట్రాంగ్ ప్రదర్శనతో ఫైనల్‌కు వచ్చింది.అండర్‌ప్రెషర్‌లో గెలవడంలో వీరు దిట్ట. మరి ఈసారైనా వీరు ఛాంపియన్ అవుతారేమో చూడాలి. 

భారత్ ICC ఫైనల్స్ లో గత అనుభవాలను మార్చుకుని గెలుస్తుందా? లేదా మరోసారి న్యూజిలాండ్ చేతిలో ఓటమి చవిచూస్తుందా? ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోపీ లీగ్ మ్యాచులు, సెమీ ఫైనల్లో అదరగొట్టి ఇండియా, న్యూజిలాండ్ తమ సత్తాను చాటిచెప్పాయి. మరి ఫైనల్లో ఎవరు సత్తా చాటుతారో చూడాలి.  

గ్రాండ్ ఫైనల్‌కు రెడీ అవ్వండి – ప్రపంచం మొత్తం చూస్తోంది! ఫైనల్‌కు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం zuplay.com ను ఫాలో అవ్వండి 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?