ఫోర్ కొట్టు... కోహ్లీని టీజ్ చేసిన అనుష్క శర్మ

By telugu news teamFirst Published Apr 18, 2020, 9:27 AM IST
Highlights

ఇటీవల వారికి సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోలను విరుష్క జోడీ అభిమానులతో పంచుకున్నారు. ఒక దాంట్లో అనుష్క.. కోహ్లీ జుట్టుకూడా కత్తిరించింది. ఆ తర్వాత వారిద్దరూ మోనోపోలీ గేమ్ ఆడామంటూ వాటి ఫోటోలు షేర్ చేశారు. కాగా.. తాజాగా.. మరో వీడియో షేర్ చేశారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో విధించిన లాక్‌డౌన్‌ను టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. లాక్‌డౌన్‌ కంటే ముందే తన సతీమణి, బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మతో తన ప్రత్యేక ఫామ్‌హౌజ్‌కు వెళ్లిపోయాడు. 

దీంతో ఈ ప్రేమ‌ప‌క్షులు ఇప్ప‌డు ఇంట్లోనే ఆనందంగా  గ‌డుపుతున్నారు. వీలుచిక్కినప్పుడల్లా సోషల్‌ మీడియాలో అభిమానులతో టచ్‌లోకి వస్తున్నారు.

 

ఇటీవల వారికి సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోలను విరుష్క జోడీ అభిమానులతో పంచుకున్నారు. ఒక దాంట్లో అనుష్క.. కోహ్లీ జుట్టుకూడా కత్తిరించింది. ఆ తర్వాత వారిద్దరూ మోనోపోలీ గేమ్ ఆడామంటూ వాటి ఫోటోలు షేర్ చేశారు. కాగా.. తాజాగా.. మరో వీడియో షేర్ చేశారు.

అందులో అనుష్క, కోహ్లీని టీజ్ చేయగా... అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. స్టేడియంలో కేరింతలు కొడుతున్న అభిమాని.. విరాట్ కోహ్లీ ఫోర్ కొట్టవా..? అని అడుగుతున్నట్లు అనుష్క శర్మ అనుకరించింది. దాంతో కోహ్లీ కూడా సీరియస్‌గా ఓ లుక్ వదిలాడు.

భారత్‌లో కరోనా వైరస్ కట్టడి కోసం విరుష్క జోడీ రూ. 3 కోట్లు విరాళంగా ప్రకటించింది. అంతేకాకుండా.. గత నెల నుంచే వైరస్ వ్యాప్తిపై సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తోంది. మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్‌ని తొలుత ఏప్రిల్ 15 వరకూ వాయిదా వేసిన బీసీసీఐ.. తాజాగా నిరవధికంగా వాయిదా వేసేసింది. దీంతో.. మరికొన్ని రోజుల పాటు క్రికెటర్లు ఆటకి దూరంగా ఉండనున్నారు.

click me!