ఏపిలో పెరుగుతున్న కరోనా కేసులు... లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినం

Arun Kumar P   | Asianet News
Published : Mar 30, 2020, 03:35 PM IST
ఏపిలో పెరుగుతున్న కరోనా కేసులు... లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినం

సారాంశం

కరోనా వైరస్ కేసులు ఆంధ్ర ప్రదేశ్ లో  రోజురోజుకు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ఆంక్షలను మరింత  కఠినతరం చేశాారు.   

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతుండటంతో లాక్ డౌన్ ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. ఇకపై కేవలం ఐదుగంటలు మాత్రమే ప్రజలను బయటికి రానివ్వనున్నట్లు పోలీసులు ప్రకటించారు. సోమవారం నుండే తాడేపల్లిలో ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు స్థానిక సీఐ అంకమ్మరావు తెలిపారు. 

ఇకపై తాడేపల్లిలో ఉ. 6 నుండి ఉ.11వరుకే వివిధ అవసరాలపై ప్రజలను రోడ్ల మీదకి అనుమతించనున్నట్లు వెల్లడించారు. పచారి షాపులు, పళ్ల మార్కెట్, రైతు బజార్లు మాత్రమే ఉ.6 నుండి 9 వరుకు తెరిచి ఉంటాయన్నారు. ఉదయం 4 నుండి ఉ. 8 వరుకు మిల్స్ & డైరి ప్రొడక్ట్ అందుబాటులో ఉంటాయన్నారు. ఉ. 5 నుండి ఉ. 9 వరుకు ఏటీయం ఫిల్లింగ్ వెహికల్స్ కు అనుమతి వుందన్నారు. 

ప్రభుత్వ, పోలీస్, ఫైర్, ఎలక్ట్రిసిటి, రెవిన్యూ, మెడికల్ & హెల్త్ డిపార్ట్‌మెంటు వెహికిల్స్ కు మాత్రమే ఎక్కడికైనై వెళ్లడానికి అనుమతి వుందన్నారు. అలాగే ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా,  ఆయిల్ & గ్యాస్ ఫిల్లింగ్, మొబైల్ కమ్యూనికేషన్స్ వెహికల్స్ కు ప్రత్యేక అనుమతి వుందన్నారు. 

నిత్యావసర సరుకుల దుకాణలకు తప్పితే ఎటువంటి దుకాణాలకు తెరిచివుంచడానికి అనుమతి లేదన్నారు. పదిమంది ఎక్కడా గుమిగూడి ఉండవద్దని...నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు. 


 

PREV
click me!

Recommended Stories

మానవత్వాన్ని చాటుకున్న సీఎం జగన్.. బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి రూ.41.50లక్షల సాయం...
కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు చేతికర్ర: టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి