ఆటోమొబైల్‌ రంగానికి టయోటా శుభవార్త‌.. త్వరలో 2 వేలకోట్ల భారీ పెట్టుబడులు..

By Sandra Ashok KumarFirst Published Sep 18, 2020, 4:51 PM IST
Highlights

అధిక  పన్నుల కారణంగా దేశంలో టయోటా కార్యకలాపాలు విస్తరించలేమన్న నివేదికలను ఖండించింది. భారతీయ మార్కెట్‌పై తాము నిబద్ధతతో కొనసాగుతున్నామని, దేశంలో వారి కార్యకలాపాలు ప్రపంచ వ్యూహంలో అంతర్భాగమని వెల్లడించింది.

న్యూ ఢీల్లీ:  జపాన్ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్  భారతదేశ ఆటోమొబైల్‌ రంగానికి గుడ్ న్యూస్ తెలిపింది. టయోటా కంపెనీ వాహన సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రిక్ భాగాల అభివృద్ధికి రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.

అధిక పన్నుల కారణంగా దేశంలో టయోటా కార్యకలాపాలు విస్తరించలేమన్న నివేదికలను ఖండించింది. భారతీయ మార్కెట్‌పై తాము నిబద్ధతతో కొనసాగుతున్నామని, దేశంలో వారి కార్యకలాపాలు ప్రపంచ వ్యూహంలో అంతర్భాగమని వెల్లడించింది.

"టయోటా కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం ఆపేస్తుంది అన్న వార్తలు తప్పు. వచ్చే 12 నెలల్లో టయోటా రూ .2,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నట్లు  టయోటా మోటర్స్ వైస్ ఛైర్మన్ విక్రామ్‌ కిర్లోస్కర్ స్పష్టం చేశారు ”అని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్విట్టర్ ద్వారా  ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్‌పై స్పందిస్తూ టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) వైస్ చైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్, “ఖచ్చితంగా! దేశీయ కస్టమర్, ఎగుమతుల కోసం ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ ఇంకా టెక్నాలజీలో మేము రూ .2,000 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నాము.

మేము భారతదేశ భవిష్యత్తుకు కట్టుబడి ఉన్నాము. సమాజం, పర్యావరణం, నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉంటాము. ” అని అన్నారు.

also read 

మరోవైపు టయోటా వ్యూహాలపై వైస్‌ చైర్మన్‌ విక్రమ్‌ కిర్లోస్కర్ స్పందిసూ‌ చిన్న కార్లలో కూడా త్వరలో అత్యాధునిక సాంకేతికత ప్రవేశపెట్టనున్నామని, 2025 సంవత్సరం వరకు హైబ్రిడ్ టెక్నాలజీ అభివృద్ధి చెందవచ్చని అభిప్రాయపడ్డారు.

దేశంలో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాన్ని బలహీనపరుస్తున్నందున, ముఖ్యంగా చైనా నుండి నిష్క్రమించాలని చూస్తున్న తయారీదారుల నుండి వచ్చిన నివేదికను భారత ప్రభుత్వం తేలికగా తీసుకోలేదు.

భారతదేశంలో ప్రణాళికలను రూపొందించడానికి తయారీదారులను ఆకర్షించడానికి 23 బిలియన్ డాలర్ల విలువైన ప్రోత్సాహకాలను ఇవ్వడానికి కేంద్రం యోచిస్తోంది. కోవిడ్-19 వల్ల దెబ్బతిన్న ఆటో రంగానికి, అధిక జీఎస్టీ రేట్లు, సెప్టెంబర్ చివరి నాటికి ప్రోత్సాహక ఆధారిత స్క్రాపేజ్ విధానాన్ని రూపొందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది.

గత ఏడాదిలో టికెఎం మార్కెట్ వాటా దేశీయ ప్రయాణీకుల వాహనాల మార్కెట్లో ఐదు శాతం కన్నా తక్కువకు పడిపోయింది. ఈ రంగంలో ఎక్కువగా మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటార్స్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
 

click me!