మరో 2 ఏళ్లలో ఇండియాలో నో టోల్ బూత్స్.. జి‌పి‌ఎస్ టోల్ కలెక్షన్ సిస్టంకు లైన్ క్లియర్: రవాణా మంత్రి

By S Ashok KumarFirst Published Dec 18, 2020, 1:03 PM IST
Highlights

ఈ చర్య దేశవ్యాప్తంగా అతుకులు లేని వాహనా ప్రయాణాలు చేస్తుందని, రాబోయే రెండేళ్లలో ఇండియా 'ఫ్రీ టోల్ బూత్ ' దేశంగా మారడానికి ఇది సహాయపడుతుందని నితిన్ గడ్కరీ అన్నారు.

భారతదేశంలో టోల్ చార్జీల వసూలు కోసం జిపిఎస్ ఆధారిత వినియోగాన్ని భారత ప్రభుత్వం క్లియర్ చేసినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, ఎంఎస్‌ఎంఇ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఈ చర్య దేశవ్యాప్తంగా అతుకులు లేని వాహనా ప్రయాణాలు చేస్తుందని, రాబోయే రెండేళ్లలో ఇండియా 'ఫ్రీ టోల్ బూత్ ' దేశంగా మారడానికి ఇది సహాయపడుతుందని నితిన్ గడ్కరీ అన్నారు.

జిపిఎస్ ఆధారిత వ్యవస్థతో వాహనాల కదలికల ఆధారంగా టోల్ చార్జ్ మొత్తాన్ని వాహన యజమానుల బ్యాంక్ ఖాతా నుండి నేరుగా చార్జ్ చేయబడుతుందని  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

ఏ‌ఎస్‌ఎస్‌ఓసి‌హెచ్‌ఏ‌ఎం ఫౌండేషన్ వీక్ ప్రోగ్రాంలో నితిన్ గడ్కరీ ప్రసంగిస్తూ, 'ఆర్థిక పునరుజ్జీవన రంగాల కోసం జాతీయ మౌలిక సదుపాయాలు కీలకం' అనే అంశంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. మార్చి 2021 నాటికి టోల్ చార్జ్ వసూలు 34,000 కోట్లకు చేరుకుంటుందని తాను ఆశిస్తున్నానని నితిన్ గడ్కరీ  తెలిపారు.

also read 

అలాగే టోల్ వసూలు కోసం జిపిఎస్ టెక్నాలజి ఉపయోగించడం ద్వారా, రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వ టోల్ ఆదాయం రూ.1,34,000 కోట్లుగా ఉంటుందని ఆయన అన్నారు. కొత్త వాణిజ్య వాహనాలు వాహన ట్రాకింగ్ వ్యవస్థతో వస్తున్నప్పటికీ, విస్తృతంగా ప్రభావం చూపే పాత వాహనాల్లో జిపిఎస్  టెక్నాలజి వ్యవస్థాపించడానికి ప్రభుత్వం కొంత ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందని గడ్కరీ చెప్పారు.

ప్రస్తుతానికి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) 2021 జనవరి 1 నుండి అన్ని నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్‌లను తప్పనిసరి చేస్తోంది. టోల్ చార్జీల వసూలు కోసం డిజిటల్, ఐటి ఆధారిత ఫీజుల చెల్లింపును ప్రోత్సహింస్తుంది,

అలాగే 1 డిసెంబర్ 2017 లోపు విక్రయించిన పాత వాహనాలకు కూడా తప్పనిసరి చేస్తుంది. ఫాస్ట్ ట్యాగ్ అనేది ప్రీపెయిడ్ ట్యాగ్, ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) చేత నిర్వహించబడే టోల్ ఛార్జీలను ఆటోమేటిక్ గా నిర్వహిస్తుంది. 

click me!