మహిళలు 2 ఏళ్లలో ధనవంతులు కావచ్చు; ఈ కేంద్ర ప్రభుత్వ స్కిం ఏంటో తెలుసా..

Published : Apr 10, 2024, 07:02 PM ISTUpdated : Apr 10, 2024, 07:04 PM IST
మహిళలు 2 ఏళ్లలో  ధనవంతులు కావచ్చు; ఈ కేంద్ర ప్రభుత్వ స్కిం ఏంటో తెలుసా..

సారాంశం

2023 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకాన్ని ప్రారంభించారు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా, మహిళలు మార్కెట్ నష్టాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.

దేశంలో  మహిళలకు వివిధ  రకాల పెట్టుబడి అప్షన్స్  ఉన్నాయి. ఇండియా పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్   అనేది ముఖ్యమైన  పెట్టుబడి పథకం. ఈ పథకం రెండేళ్లలో మహిళలను ధనవంతులను చేస్తుంది. దీని  ప్రత్యేకత ఏమిటంటే ఈ పథకం కేవలం మహిళలకు మాత్రమే. ప్రభుత్వ పథకాల ద్వారా మహిళలు పెట్టుబడిపై మంచి రాబడిని పొందవచ్చు

2023 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ పథకాన్ని ప్రారంభించారు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా, మహిళలు మార్కెట్ నష్టాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా  ఈ పథకం  హామీ ఆదాయాన్ని అందిస్తుంది. ఈ పథకం కింద మహిళలు 2 సంవత్సరాల పాటు గరిష్టంగా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మీరు రెండేళ్లలో మీ పెట్టుబడిపై 7.5 శాతం వడ్డీని పొందుతారు.

ఏ వయస్సులోనైనా మహిళలు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు ఇంకా గరిష్ట పెట్టుబడి మొత్తం రూ. 2 లక్షలు. ఈ ఆదాయంపై మహిళలకు ఆదాయపు పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. సెక్షన్ 80సీ కింద ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి రూ.1.50 లక్షల మినహాయింపు లభిస్తుంది. ఈ పథకం కింద రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ సమయంలో రూ.2,32,044 లక్షలు పొందుతారు. 

PREV
click me!

Recommended Stories

Youtube Income: యూట్యూబ్‌లో గోల్డెన్ బటన్ వస్తే నెలకు ఎన్ని డబ్బులు వస్తాయి?
Income Tax: ఇంట్లో డ‌బ్బులు దాచుకుంటున్నారా.? అయితే మీ ఇంటికి అధికారులు రావొచ్చు