అబ్బా.. రిటైర్ అయ్యాక కూడా ఎంత డబ్బు సంపాదించాడో చూసారా ?

By Ashok kumar SandraFirst Published Apr 10, 2024, 5:01 PM IST
Highlights

2023లో ఐటి సెక్టార్‌లో అత్యధిక వేతనం పొందిన CEOగా  కూడా థియరీ డెలాపోర్టే సెలెక్ట్ అయ్యారు. డెలాపోర్టే తన రిటైర్మెంట్  సమయంలో ఎంత డబ్బు పొందారో  మీకు తెలుసా?

ఐటీ దిగ్గజం విప్రో సీఈవో థియరీ డెలాపోర్టే తాజగా  తన పదవి నుంచి రిటైర్మెంట్‌ను ప్రకటించారు. కొత్త CEO  రానున్న ఐదేళ్ల కాలానికి ఏప్రిల్ 7, 2024న బాధ్యతలు స్వీకరించారు. అయితే థియరీ డెలాపోర్టే స్థానంలో శ్రీనివాస్ పల్లియా సెలెక్ట్ అయ్యారు. 56 ఏళ్ల డెలాపోర్టే చాలా సంవత్సరాలు విప్రోలో పనిచేసిన తర్వాత భారీ మొత్తాన్ని  సంపాదించాడు. విప్రో సీఈవో కాకముందు క్యాప్‌జెమినీలో సీఓఓగా పనిచేశారు. దాదాపు 25 ఏళ్లుగా అక్కడ వివిధ పదవుల్లో ఉన్నారు.

డెలాపోర్టే జూలై 6, 2020న విప్రోలో చేరారు. కానీ అతనికి ముందు ఉన్న అబిదాలి నీముచ్‌వాలా లాగానే డెలాపోర్టే తన పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి కావడానికి  ముందే రైటర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. డెలాపోర్టే నాయకత్వంలో విప్రో మార్కెట్ క్యాపిటలైజేషన్ మూడవ స్థానం నుండి నాల్గవ స్థానానికి పడిపోయింది. నివేదికల ప్రకారం వరుసగా నాలుగో త్రైమాసికంలో లాభం తగ్గిందని, ఏడాది ప్రాతిపదికన 12 శాతం క్షీణించి రూ.2,694 కోట్లకు పడిపోయిందని కంపెనీ పేర్కొంది.

 2023లో అత్యధిక వేతనం పొందిన CEO
అయితే , FY23లో IT రంగంలో అత్యధిక వేతనం పొందిన CEOగా డెలాపోర్టే ఉన్నారు. USD 10 మిలియన్ అంటే భారతీయ కరెన్సీలో రూ. 82 కోట్లకు సమానం. ఇంకా గొప్ప  రెమ్యూనరేషన్ అందుకున్నారు. అతని ప్రాథమిక వేతనం రూ. 9.5 కోట్లు, అలవెన్సులు మొత్తం రూ. 3.57 కోట్లుగా  ఉంది.

డెలాపోర్టే, ఒక ఫ్రెంచ్ జాతీయుడు, సైన్సెస్ పో పారిస్ నుండి ఆర్థిక శాస్త్రం, ఫైనాన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. తరువాత అతను సోర్బోన్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్ ఆఫ్ లాస్ డిగ్రీని పొందాడు.

కొత్త సీఈవో శ్రీనివాస్ పల్లియా, 32 ఏళ్ల నుంచి విప్రో ఉద్యోగి
ప్రస్తుతం విప్రో కొత్త సీఈవో శ్రీనివాస్ పల్లియా. ఇతను 32 ఏళ్లుగా విప్రోలో పనిచేస్తున్నారు. 1992లో విప్రోలో ప్రొడక్ట్ మేనేజర్‌గా పని చేయడం ప్రారంభించారు. అతను US సెంట్రల్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్, USA అండ్  మార్కెటింగ్‌లో ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్  సహా వివిధ పాత్రలను నిర్వహించాడు. 

ఎడ్యుకేషన్ : 1992లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ డిగ్రీ ఇంకా  హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో లీడింగ్ గ్లోబల్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్,  మెక్‌గిల్ ఎగ్జిక్యూటివ్ ఇన్‌స్టిట్యూట్‌లో అడ్వాన్స్‌డ్ లీడర్‌షిప్ కోర్సు చేసారు.

విప్రోను 1945లో మహమ్మద్ ప్రేమ్‌జీ స్థాపించారు. అయితే వ్యవస్థాపకుడి అకాల మరణం తరువాత, కంపెనీ పగ్గాలను బిలియనీర్ అజీమ్ ప్రేమ్‌జీ స్వాధీనం చేసుకున్నారు, అతను ఇప్పటి వరకు బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. 93,400 కోట్ల విలువైన విప్రోలో మొత్తంగా ఆరు ఖండాల్లో 2,50,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

click me!