దిగోచ్చిన బంగారం ధరలు... ప్రస్తుత ధరెంతంటే.....?

By Sandra Ashok KumarFirst Published Jan 9, 2020, 12:26 PM IST
Highlights

 బంగారం 10 గ్రాములకు 0.04 శాతం తగ్గి రూ .40,095 వద్ద ఉండగా, వెండి  0.21 శాతం పడిపోయి కిలోకు 47,291 రూపాయలకు చేరుకుంది.బులియన్ కౌంటర్లు మరింత లాభాల బుకింగ్‌ను చూడవచ్చని బ్రోకరేజ్ ఎస్‌ఎంసి గ్లోబల్ తెలిపింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలకు భరోసా ఇచ్చిన నేపథ్యంలో పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో బులియన్ కౌంటర్లు బుధవారం పడిపోయాయి. ఇరాక్‌లో రాత్రి సమయంలో అమెరికా సైనికులు ఉన్న సైనిక స్థావరాలపై ఇరాన్ చేసిన దాడులపై అమెరికా సైనికపరంగా స్పందించాల్సిన అవసరం లేదని ట్రంప్ అన్నారు.ఈ దాడులలో అమెరికన్లకు ఎలాంటి నష్టం జరగలేదని  తెలిపారు.

also read ‘2022 నాటికి దేశంలో అందరికీ సొంతిల్లు’....నిరంజన్ హీరా

అయితే బంగారం 10 గ్రాములకు 0.04 శాతం తగ్గి రూ .40,095 వద్ద ఉండగా, వెండి  0.21 శాతం పడిపోయి కిలోకు 47,291 రూపాయలకు చేరుకుంది.బులియన్ కౌంటర్లు మరింత లాభాల బుకింగ్‌ను చూడవచ్చని బ్రోకరేజ్ ఎస్‌ఎంసి గ్లోబల్ తెలిపింది. 40,300 రూపాయల దగ్గర ప్రతిఘటనను ఎదుర్కొంటున్నప్పుడు బంగారం 39,800 రూపాయల వరకు తగ్గవచ్చు, వెండి 47,000 రూపాయలు ఉంటుండొచ్చు.  

అంతర్జాతీయ మార్కెట్లలో, బుధవారం దాదాపు ఏడు సంవత్సరాలలో మొదటిసారిగా 1,600 డాలర్లకు మించి బంగారం 1 శాతానికి పైగా పడిపోయింది.నిపుణులు బంగారం ధరలు అస్థిరంగా ఉండవచ్చని, 40,200-40,350 వరకు బంగారం ధర ఉండిపోతుందని భావిస్తున్నారు.

also read 11 ఏళ్లలో అత్యంత కనిష్ఠ స్థాయికి... దేశ జీడీపీపై కేంద్ర ప్రభుత్వ అంచనాలు... 

స్పాట్ బంగారం దాదాపు 1 శాతం తగ్గి ఔన్స్ 1,559.22 డాలర్లకు చేరుకుంది. ఇంతకు ముందు ధరలు సెషన్‌లో 1,610.90 కు పెరిగాయి, ఇది మార్చి 2013 నుండి అత్యధిక స్థాయి.ఎంసిఎక్స్‌లో, ఫిబ్రవరిలో బంగారు ఒప్పందాలు రూ .18 లేదా 0.04 శాతం తగ్గి 10 గ్రాముకు రూ .40,092 వద్ద ట్రేడవుతున్నాయి.

ఇరాక్‌లోని అమెరికా సైన్యం స్థావరంపై ఇరాన్ దాడి చేసిన తరువాత బుధవారం బంగారం రికార్డు స్థాయిని తాకింది. ఎంసిఎక్స్ గోల్డ్ రికార్డు స్థాయిలో 41,293, వెండి గరిష్ట స్థాయి 48,925 ను తాకింది.

click me!