new rule:బ్యాంక్‌ రూల్స్ లో నేటి నుండి పెద్ద మార్పు.. కస్టమర్లపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే..?

Ashok Kumar   | Asianet News
Published : Apr 04, 2022, 01:16 PM IST
new rule:బ్యాంక్‌ రూల్స్ లో నేటి నుండి పెద్ద మార్పు.. కస్టమర్లపై ఎలాంటి ప్రభావం  ఉంటుందంటే..?

సారాంశం

 మీ బ్యాంక్  ఖాతా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో ఉన్నట్లయితే 4 ఏప్రిల్ 2022 అంటే సోమవారం నుండి కొత్త మార్పు జరుగుతోంది. బ్యాంక్ నేటి నుంచి పాజిటివ్ పే సిస్టమ్‌ని అమలు చేస్తోంది. దీని తర్వాత చెక్ క్లియరెన్స్ ప్రక్రియ మారుతుంది.  

దేశంలోనే రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)ఈరోజు నుంచి బ్యాంక్ రూల్స్‌లో భారీ మార్పులు చేస్తోంది. మీ బ్యాంక్ ఖాతా ఈ బ్యాంకులో ఉన్నట్లయితే ఈ వార్త మీకు చాలా ముఖ్యమైంది. నివేదిక ప్రకారం కొత్త రూల్ మార్పు సోమవారం అంటే 4 ఏప్రిల్ 2022 నుండి అమలులోకి వస్తుంది. పి‌ఎన్‌బి బ్యాంక్ పాజిటివ్ పే సిస్టమ్‌ నియమాన్ని అమలు చేస్తోంది, అంటే చెక్ క్లియరెన్స్ ప్రక్రియ మారుతుంది.

చెక్ పేమెంట్ వెరిఫికేషన్ తప్పనిసరి 
ఈ నియమం పి‌ఎన్‌బిలో మాత్రమే వర్తిస్తుంది కాబట్టి, పేమెంట్ కోసం చెక్‌ను జారీ చేసే సమయంలో  తప్పనిసరిగా వెర్ఫికేషన్ చేయబడుతుందని గమనించాలి. వెర్ఫికేషన్ లేకుండా చెక్కు ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ చేయబడదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కంటే ముందు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఫిబ్రవరి 1న పాజిటివ్ పే సిస్టమ్‌ రూల్ ని స్వయంగా అమలు చేసింది. 

బ్యాంకింగ్ మోసాలు 
గతంలో బ్యాంకింగ్ మోసాల కేసులు గణనీయంగా పెరిగాయి. ఇలాంటి కేసుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా ఖాతాదారులకు రక్షణ కల్పించే లక్ష్యంతో బ్యాంకులు  నిబంధనలను మారుస్తున్నాయి. కొత్త నిబంధన ప్రకారం, ఇప్పుడు ఎవరికైనా PNB చెక్కును జారీ చేసేటప్పుడు మీరు చెక్కు తేదీ, లబ్ధిదారుని పేరు, ఖాతా నంబర్, చెక్కులో పేర్కొన్న మొత్తం వివరాలను ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, ATM లేదా మొబైల్ బ్యాంకింగ్ లేదా SMS ద్వారా పంచుకోవాలి. వెర్ఫికేషన్ తర్వాత చెక్ త్వరగా క్లియర్ చేయబడుతుంది ఇంకా మోసం జరిగే అవకాశం ఉండదు. 

మోసాన్ని నిరోధించడానికి  
బ్యాంకింగ్ మోసాలని నిరోధించడానికి పాజిటివ్ పే సిస్టమ్‌ కూడా ఒక సాధనం. దీని ద్వారా చెక్ పేమెంట్ చేసేటప్పుడు మొత్తం సమాచారాన్ని ధృవీకరించవచ్చు ఇంకా కస్టమర్లకు జరిగే ఏదైనా మోసం నుండి  రక్షించబడతారు. PNB  అధికారిక వెబ్‌సైట్ 4 ఏప్రిల్ 2022 నుండి ఈ నియమం అమలు గురించి సమాచారాన్ని అందించింది. ఒక వ్యక్తి 10 లక్షల కంటే ఎక్కువకు  చెక్ జారీ చేస్తే, అతని చెక్కు పాస్ కావడానికి PPS నిర్ధారణ అవసరమని తెలిపింది.

PREV
click me!

Recommended Stories

వడ్డీ రేటు తగ్గకున్నా.. రూ. 50 లక్షల హోం లోన్‌పై డబ్బు ఆదా చేయండిలా..
Savings: రోజుకు రూ. 300 ప‌క్క‌న పెడితే.. రూ. 40 ల‌క్ష‌లు సొంతం చేసుకోవ‌చ్చు