లోన్ మొరాటోరియం కేసు: విచారణను నవంబర్ 18 వరకు వాయిదా వేసిన సుప్రీంకోర్టు

By Sandra Ashok KumarFirst Published Nov 5, 2020, 4:31 PM IST
Highlights

వడ్డీపై వడ్డీ విషయంలో సుప్రీంకోర్టు నవంబర్ 18 వరకు విచారణను వాయిదా వేసింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందుబాటులో లేక  పోవడంతో విచారణ వాయిదా పడింది. 

రుణాల తాత్కాలిక నిషేధం పొందే వారిపై వడ్డీపై వడ్డీ విషయంలో సుప్రీంకోర్టు నవంబర్ 18 వరకు విచారణను వాయిదా వేసింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందుబాటులో లేక  పోవడంతో విచారణ వాయిదా పడింది.

మార్చి 1 నుండి ఆగస్టు 31 వరకు ఆర్‌బిఐ  రుణాల తాత్కాలిక నిషేధ పథకాన్ని ప్రవేశపెట్టిన తరువాత రుణగ్రహీతలు చెల్లించని ఇఎంఐలపై బ్యాంకులు వడ్డీ వసూలు చేయడానికి సంబంధించిన వాదనలపై విచారణ కొనసాగుతుంది.

ఈ కేసులో రిజర్వ్ బ్యాంక్, ఆర్థిక మంత్రిత్వ శాఖ విడివిడిగా అఫిడవిట్లు దాఖలు చేశాయి.  నవంబర్ 5లోగా రుణగ్రహీతల ఖాతాలో చక్ర వడ్డీకి, సాధారణ వడ్డీకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు జమ చేస్తామని మంత్రిత్వ శాఖ, ఆర్‌బిఐ కోర్టుకు తెలిపాయి. 

రుణాల వడ్డీపై వడ్డీ మినహాయింపుపై మార్గదర్శకాలను ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. 29 ఫిబ్రవరి 2020 నాటికి రెండు కోట్ల రూపాయలకు మించని రుణగ్రహీతలు ఈ పథకాన్ని పొందటానికి అర్హులు. అంటే, రుణగ్రహీతలందరికీ ఈ ఉపశమనం లభిస్తుంది.

also read  

రుణాల చెల్లింపు పై ఆరు నెలల మినహాయింపును సద్వినియోగం చేసుకున్నారా లేదా అనేదానిపై సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తాత్కాలిక రుణాల నిషేధాన్ని పొందని వినియోగదారులకు బ్యాంకు నుండి క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

ఈ పథకంలో గృహ రుణాలు, విద్యా రుణాలు, క్రెడిట్ కార్డు బకాయిలు, ఆటోమొబైల్ రుణాలు, ఎంఎస్‌ఎంఇ కోసం తీసుకున్న రుణాలు ఉన్నాయి. రుణాల మొరాటోరియం కాలంలో  ఈ‌ఎం‌ఐ చెల్లింపుకు సంబంధించి చాలా ప్రశ్నలు తలెత్తాయి. దీంతో వడ్డీపై వడ్డీ వసూల్  కేసు సుప్రీంకోర్టుకు చేరింది.

రుణాల తాత్కాలిక నిషేధంలో (మార్చి నుండి ఆగస్టు వరకు) వడ్డీపై వడ్డీని మాఫీ చేయడానికి అంగీకరించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫిడవిట్‌లో పేర్కొంది. వడ్డీ మాఫీ మొత్తం సుమారు రూ .6,500 కోట్లు అని ప్రభుత్వ వర్గాలు అంచనా వేశాయి.

 కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో ఆర్‌బిఐ ఈ‌ఎం‌ఐ చెల్లింపు నుండి మినహాయింపు కింద రూ .2 కోట్ల వరకు రుణాలపై వడ్డీని మాఫీ చేయడంపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు అక్టోబర్ 14 న కేంద్రానికి ఆదేశించింది.

click me!