ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. మరో 3 నెలల పాటు మారిటోరియం పొడిగింపు!

Ashok Kumar   | Asianet News
Published : May 29, 2020, 01:32 PM ISTUpdated : May 29, 2020, 10:15 PM IST
ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్ న్యూస్.. మరో 3 నెలల పాటు మారిటోరియం పొడిగింపు!

సారాంశం

ఎస్‌బి‌ఐ అన్ని టర్మ్ లోన్ల ఈ‌ఎం‌ఐలను మరో మూడు నెలల పాటు ఆటోమేటిక్‌గా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.గతంలో లోన్లపై  అది మార్చి 1 నుంచి మే 31 మూడు నెలల మారిటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సంక్షోభం వల్ల రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా తాజాగా మరోసారి మరో మూడు నెలల పాటు మారిటోరియం కొనసాగించనున్నట్లు వెల్లడించింది.

ముంబయి: బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బి‌ఐ  వారి కస్టమర్లకు గుడ్ న్యూస్ తెలిపింది. అర్హత గల రుణగ్రహీతలందరి  ఊరటను ఇచ్చింది. ఎస్‌బి‌ఐ అన్ని టర్మ్ లోన్ల ఈ‌ఎం‌ఐలను మరో మూడు నెలల పాటు ఆటోమేటిక్‌గా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో లోన్లపై  అది మార్చి 1 నుంచి మే 31 మూడు నెలల మారిటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. 

కరోనా వైరస్ సంక్షోభం వల్ల రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా తాజాగా మరోసారి మరో మూడు నెలల పాటు మారిటోరియం కొనసాగించనున్నట్లు వెల్లడించింది. దీనితో రెండో మారిటోరియం జూన్ 1 నుంచి ఆగష్టు 31 వరకు ఉంటుంది. ఇంకా ఈ విషయంపై బ్యాంకులు నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ఎస్‌బి‌ఐ మాత్రం టర్మ్ లోన్ల ఈఎంఐలపై మరో మూడు నెలలు మారిటోరియం కొనసాగిస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. 

తాత్కాలిక పొడిగింపు ఆటోమేటిక్‌గా ఉంటుందా లేదా వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉందా అని తెలియాల్సి ఉంది. దాదాపు 85 లక్షల  అర్హత గల రుణగ్రహీతలకు ఒక చిన్న ఎస్‌ఎం‌ఎస్ ఎస్ఎంఎస్ కమ్యూనికేషన్‌ను ప్రారంభించనుంది.

also read బిగిసిన ‘డ్రాగన్’ పట్టు: హాంకాంగ్‌పై భద్రతా చట్టానికి ఓకే..

రుణగ్రహీతలు ఇఎంఐలను వాయిదా వేయాలనుకుంటే, వారు ఎస్ఎంఎస్ అందుకున్న ఐదు రోజుల్లోపు బ్యాంక్ పంపిన ఎస్ఎంఎస్‌లో పేర్కొన్న వర్చువల్ మొబైల్ నంబర్‌కు (విఎంఎన్) అవును అని సమాధానం ఇవ్వాలి ”అని ఒక ప్రకటనలో తెలిపింది.

ఎస్‌బి‌ఐ చైర్మన్ రజనీష్ కుమార్ మే 22 న మాట్లాడుతూ, రుణగ్రహీతలలో 20% మంది తాత్కాలిక నిషేధాన్ని పొందారని చెప్పారు. ఆర్‌బిఐ మరో మూడు నెలలు పొడిగించడం వల్ల వన్-టైమ్ డెట్ రీకాస్ట్ రిలీఫ్ లేకపోయినా రుణగ్రహీతలకు నగదు ప్రవాహ అంతరాయాలను లేకుండా చూసుకుంటామని ఆయన చెప్పారు.

కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ 40 బేసిస్ పాయింట్ (బిపిఎస్) రెపో రేట్ కోత, పలు నియంత్రణ చర్యలను ప్రకటించిన వెంటనే ఎస్‌బి‌ఐ చైర్మన్ రజనీష్ కుమార్ విలేకరులతో మాట్లాడారు.

PREV
click me!

Recommended Stories

Business Ideas: లైఫ్ సెటిల్ అయ్యే బిజినెస్‌.. పేప‌ర్ ఎగ్ ట్రే త‌యారీతో ఉన్న ఊరిలోనే లక్షలు సంపాదించ‌వ‌చ్చు
Car Tips: కారు వేగంగా ఉన్న‌ప్పుడు బ్రేక్ ప‌డ‌క‌పోతే ఏం చేయాలో తెలుసా.? అస్స‌లు టెన్ష‌న్ ప‌డ‌కండి