ప్లగింగ్ ద్వారా 2.7 టన్నుల ప్లాస్టిక్ సేకరించిన "రన్ టు మేక్ కంట్రీ ఫ్రీ"

By Sandra Ashok KumarFirst Published Dec 6, 2019, 10:04 AM IST
Highlights

‘ఆర్|ఎలాన్  రన్ టు మేక్ ఇండియా లిట్టర్ ఫ్రీ’  గురించి సిఐఓ  ఆర్‌ఐఎల్  గుంజన్ శర్మ మాట్లాడుతూ  “ఈ ప్లగింగ్ రన్ కు దేశవ్యాప్తంగా  మంచి స్పందన వచ్చింది. R|ఎలాన్  రన్ టు ఇండియా లిట్టర్ ఫ్రీ,  గురించి అవగాహన కల్పించడం ద్వారా ప్రజలలో ఆరోగ్యకరమైన  అలవాట్లను పెంచడానికి నిజంగా సహాయపడింది. దీని ద్వారా సేకరించిన పిఇటి బాటిళ్లతో తయారు చేసిన ఆర్|ఎలాన్ ఫ్యాబ్రిక్స్ నుండి  దుస్తులను తయారు చేస్తాము.

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నెక్స్ట్ జనరేషన్ ఫ్యాబ్రిక్స్ R|ఎలాన్ ద్వారా నిర్వహించిన "రన్ టు ఇండియా లిట్టర్ ఫ్రీ” నిర్వహించింది. న్యూ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. రిపు డామన్ బెవ్లీతో కలిసి 50 నగరాలలో ప్లగింగ్ చేశారు. భారతదేశంలోని 50 నగరాల్లో 1,000 కిలోమీటర్ల  తిరిగి 2.7 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించారు.

also read భళా సుందరా.. పిచాయ్ ప్రమోషన్‌తో వారి ఖాతలోకి 200 కోట్లు!

దేశంలో పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం, అలాగే ఫిట్‌నెస్‌ను పెంచే అలవాటును పెంపొందించెందుకు R|ఎలన్  భారతదేశపు మొదటి ప్లగర్ రిపు డామన్తో చేతులు కలిపారు.ప్లాగర్ల ద్వారా ప్లాస్టిక్‌లను సేకరించి రీసైక్లింగ్ కోసం పంపిస్తారు. ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకిలో RIL  పోస్ట్-కన్స్యూమర్ పిఇటి బాటిల్ రీసైక్లింగ్ ద్వారా ప్రతి సంవత్సరం 2.25 బిలియన్ పిఇటి బాటిళ్లను రీసైకిల్ చేస్తుంది. 

‘ఆర్|ఎలాన్  రన్ టు మేక్ ఇండియా లిట్టర్ ఫ్రీ’  గురించి సిఐఓ  ఆర్‌ఐఎల్  గుంజన్ శర్మ మాట్లాడుతూ  “ఈ ప్లగింగ్ రన్ కు దేశవ్యాప్తంగా  మంచి స్పందన వచ్చింది. R|ఎలాన్  రన్ టు ఇండియా లిట్టర్ ఫ్రీ,  గురించి అవగాహన కల్పించడం ద్వారా ప్రజలలో ఆరోగ్యకరమైన  అలవాట్లను పెంచడానికి నిజంగా సహాయపడింది. దీని ద్వారా సేకరించిన పిఇటి బాటిళ్లతో తయారు చేసిన ఆర్|ఎలాన్ ఫ్యాబ్రిక్స్ నుండి  దుస్తులను తయారు చేస్తాము.

also read వడ్డీరేట్లు పై ఆర్‌బీఐ గుడ్ న్యూస్

మన పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవడంలో ఇది సహాయపడుతుంది. మేము ‘ఫ్యాషన్ ఫర్ ఎర్త్’ను ప్రారంభించి దీని కింద ఫ్యాషన్ డిజైనర్లు అలాగే వస్త్ర పరిశ్రమల మధ్య సంబంధాలు పెంచడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. రిపు డామన్ మాట్లాడుతూ “ఇది ఒక డ్రీమ్ రన్ "ఆర్|ఎలాన్  రన్ టు ఇండియా లిట్టర్ ఫ్రీ" అనేది భారతదేశ లిట్టర్ ఫ్రీని రియాలిటీగా చూడాలనేది నా కల. మేము భారతదేశం అంతటా 50 నగరాలు  తిరిగి 1000 కి.మీ.లను కవర్ చేసాము.

మా ఈ ప్రయత్నాలను ప్రధాని నరేంద్ర మోడీ కూడా గుర్తించారని, అక్టోబర్ 2 న ఢిల్లీలో జరిగే ఎఫ్‌ఐటి ఇండియా రన్‌లో పాల్గొనమని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మమ్మల్ని ఆహ్వానించినందుకు మాకు గర్వంగా ఉంది. 
 

click me!