లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ లో రిలయన్స్ రిటెల్ భారీ పెట్టుబడి.. 15 ఏళ్ల తరువాత ఇండియాలోకి ఎంట్రీ..

Ashok Kumar   | Asianet News
Published : Mar 02, 2022, 10:53 AM ISTUpdated : Mar 02, 2022, 10:55 AM IST
లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ లో రిలయన్స్ రిటెల్ భారీ పెట్టుబడి.. 15 ఏళ్ల తరువాత ఇండియాలోకి ఎంట్రీ..

సారాంశం

ఏ&టి వెంచర్‌ను 1992లో డేవిడ్ అబ్రహం అండ్ రాకేష్ ఠాకోర్ ప్రారంభించారు. లాంజ్‌వేర్ ఇంకా హోమ్ కలెక్షన్‌లతో ఏ&టి మొదట మార్కెట్‌లోకి ప్రవేశించింది. తరువాత దాదాపు 15 సంవత్సరాల పాటు అంతర్జాతీయ స్టోర్లలో రిటైల్ చేసిన తర్వాత ఈ బ్రాండ్ ఇప్పుడు భారతదేశంలోకి ప్రవేశించింది.  

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్  అనుబంధ సంస్థ  రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ మంగళవారం స్వదేశీ డిజైనర్ బ్రాండ్ అబ్రహం & ఠాకోర్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మెజారిటీ వాటా కోసం  పెట్టుబడి పెట్టినట్లు తెలిపింది. 


ఏ&టి వెంచర్‌ను 1992లో డేవిడ్ అబ్రహం అండ్ రాకేష్ ఠాకోర్ ప్రారంభించారు. లాంజ్‌వేర్ ఇంకా హోమ్ కలెక్షన్‌లతో ఏ&టి మొదట మార్కెట్‌లోకి ప్రవేశించింది. తరువాత దాదాపు 15 సంవత్సరాల పాటు అంతర్జాతీయ స్టోర్లలో రిటైల్ చేసిన తర్వాత ఈ బ్రాండ్ ఇప్పుడు భారతదేశంలోకి ప్రవేశించింది.

డిజైనర్ మనీష్ మల్హోత్రాలో పెట్టుబడులతో పాటు భారతీయ కోటూరియర్ అనామికా ఖన్నాతో భాగస్వామ్యాన్ని కంపెనీ గత ఏడాది చివర్లో ప్రకటించిన తర్వాత పెట్టుబడి జరిగింది.

“ఆర్‌ఆర్‌వి‌ఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ భారతీయ కస్టమర్‌ల లోతైన అవగాహన, డిజిటల్, రిటైల్ కార్యకలాపాలు, మార్కెటింగ్ అండ్ సప్లై చైన్ ప్లాట్‌ఫారమ్‌లో బ్రాండ్ అబ్రహం & ఠాకూర్  గ్లోబల్ అప్పీల్‌ను ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టైల్ విభాగంలో నిర్మించడానికి ప్రయత్నిస్తుంది. " అని కంపెనీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఏ&టి వెంచర్‌ను 1992లో డేవిడ్ అబ్రహం అండ్ రాకేష్ ఠాకోర్ ప్రారంభించారు. తరువాత కెవిన్ నిగ్లీ భారతీయ చేనేతతో కలిసి పని చేయడం ద్వారా ఆధునికత, అర్థంతో వాటిని నేయడం ఇంకా డిజైన్ ద్వారా సంప్రదాయేతర, నాన్-కన్ఫార్మిస్ట్ మార్గాల్లో చేరారు.  డేవిడ్ అబ్రహం, రాకేష్ ఠాకోర్, కెవిన్ నిగ్లీ బ్రాండ్  క్రియేటివ్ డైరక్షన్ లో నాయకత్వం వహిస్తారు. 

ఏ&టి లాంజ్‌వేర్ ఇంకా హోమ్ కలెక్షన్‌లతో మొదట మార్కెట్‌లోకి ప్రవేశించింది. బ్రాండ్ ఉత్పత్తిని మొదట లండన్‌లోని ది కాన్రాన్ షాప్‌లో తరువాత లిబర్టీ, బ్రౌన్స్, హారోడ్స్ అండ్ సెల్ఫ్రిడ్జెస్ వంటి ప్రతిష్టాత్మక గ్లోబల్ స్టోర్‌లలో విక్రయాలను ప్రారంభించింది. దాదాపు 15 సంవత్సరాల పాటు అంతర్జాతీయ స్టోర్లలో రిటైల్ చేసిన తర్వాత ఈ బ్రాండ్ ఇప్పుడు భారతదేశంలోకి ప్రవేశించింది.  

ఈ భాగస్వామ్యం గురించి వ్యాఖ్యానిస్తూ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ, “అబ్రహం అండ్ ఠాకోర్ సాంప్రదాయ వస్త్ర పద్ధతులను ఉపయోగించి అద్భుతమైన డిజైన్‌లను రూపొందించారు. భారతీయ లగ్జరీ కస్టమర్ల సంఖ్య పెరుగుతున్నందున అటువంటి ఉత్పత్తికి డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఇది మా భాగస్వామ్యన్ని బలోపేతం చేస్తుంది. అదే సమయంలో రిలయన్స్ రిటైల్‌తో టైఅప్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నానని డేవిడ్ అబ్రహం అన్నారు. 

2021లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో భాగమైన రిలయన్స్ బ్రాండ్స్ లిమిటెడ్ (RBL), స్వదేశీ డిజైనర్ మనీష్ మల్హోత్రా యాజమాన్యంలోని ఎం‌ఎం స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 40% వాటాను కొనుగోలు చేయడానికి అంగీకరించింది.  ఆర్‌ఆర్‌వి‌ఎల్ 31 మార్చి 2021తో ముగిసిన సంవత్సరానికి  రూ.1,57,629 కోట్ల కన్సాలిడేటెడ్ టర్నోవర్‌ని నివేదించింది. రిలయన్స్ రిటైల్ భారతదేశంలో అతిపెద్ద రిటైలర్‌లలో ఒకటి.

PREV
click me!

Recommended Stories

Post office: రిటైర్మైంట్ త‌ర్వాత బిందాస్‌గా బ‌త‌కొచ్చు.. నెల‌కు రూ. 10 వేలు వ‌చ్చే బెస్ట్ స్కీమ్
Atal Pension yojana: రూ. 500 చెల్లిస్తే చాలు.. నెల‌కు రూ. 5 వేల పెన్ష‌న్. ఈ స్కీమ్ గురించి తెలుసా?