ఆర్‌బీఐ కీలక నిర్ణయం: వరుసగా నాలుగోసారి కూడా వడ్డీరేట్లు యథాతథం

By S Ashok KumarFirst Published Feb 5, 2021, 11:39 AM IST
Highlights

ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం నేడు  ముగిసింది. కమిటీ తీసుకున్న నిర్ణయాలను  ఆర్‌బి‌ఐ  గవర్నర్ శక్తికాంత దాస్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)  ద్రవ్య విధాన కమిటీ సమావేశం నేడు  ముగిసింది. కమిటీ తీసుకున్న నిర్ణయాలను  ఆర్‌బి‌ఐ  గవర్నర్ శక్తికాంత దాస్ విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

కరోనా వైరస్ మహమ్మారి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. ఇటువంటి పరిస్థితిలో ఆర్‌బి‌ఐ చేసే ప్రకటనలు చాలా ముఖ్యమైనవి. సాధారణ బడ్జెట్ 2021-22 సమర్పించిన తరువాత ఎంపిసి చేసిన మొదటి రివ్యూ సమావేశం ఇది.

గత మూడు రివ్యూ సమావేశాలలో వడ్డీ రేట్లను ఎంపిసి మార్చలేదు. రిజర్వ్ బ్యాంక్ చివరిసారిగా పాలసీ రేట్లను 22 మే 2020న సవరించింది. అలాగే ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను మించిందని ఆర్‌బి‌ఐ గవర్నర్  ప్రకటించారు. 

ముఖ్యమైన విషయాలు

1.ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్రవ్య విధాన కమిటీ సభ్యులకు మొదట కృతజ్ఞతలు తెలిపారు.

2.రెపో రేటులో ఆర్‌బిఐ ఎటువంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం ఇది నాలుగు శాతంగా ఉంది. ఎంపిసి ఈ నిర్ణయం ఏకగ్రీవంగా తీసుకుంది. అంటే, వినియోగదారులకు ఇఎంఐ లేదా రుణ వడ్డీ రేట్లపై కొత్త ఉపశమనం లభించలేదు.

3.రెపో రేటు కూడా 3.35 శాతంగా స్థిరంగా ఉందని దాస్ తెలిపారు.

also read 

4.దీనితో బ్యాంక్ రేటును మార్చకూడదని నిర్ణయించారు. ఇది 4.25 శాతంగా ఉంది.

5.మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటు కూడా 4.25 శాతంగా ఉంది.

6.దీనితో పాటు, సెంట్రల్ బ్యాంక్ ద్రవ్య వైఖరిని 'లిబరల్' గా ఉంచింది.

7.వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2021-22లో దేశ జిడిపిలో 10.5 శాతం పెరుగుదల ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. బడ్జెట్‌లో ఇది 11 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

8.2020-21 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (జనవరి-మార్చి) ద్రవ్యోల్బణ రేటు 5.2 శాతం వరకు ఉండవచ్చని శక్తికాంత దాస్ తెలిపారు. 

9.2021-22 ఆర్థిక సంవత్సరంలో, రిటైల్ ద్రవ్యోల్బణ రేటు 5.8 శాతంగా అంచనా వేసింది.
 

click me!