ఉమెన్స్ డే రోజున మహిళలకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్.. వంట గ్యాస్ ధర రూ.100 తగ్గింపు..

By Ashok kumar SandraFirst Published Mar 8, 2024, 11:07 AM IST
Highlights

ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 900 రూపాయలు ($11). ఇదిలా ఉండగా, ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఉజ్వల యోజన కింద పేద మహిళలకు ఎల్‌పిజి సిలిండర్ సబ్సిడీపై రూ 300 పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది .
 

 న్యూఢిల్లీ: నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వంటగ్యాస్ సిలిండర్ ధరలను రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ   ప్రకటించారు.

"ఈ రోజు, మహిళా దినోత్సవం సందర్భంగా, మా ప్రభుత్వం ఎల్‌పిజి సిలిండర్ ధరలను రూ.100 తగ్గించాలని నిర్ణయించింది. ఈ చర్య  దేశవ్యాప్తంగా కోట్ల  కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది, ముఖ్యంగా మా నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుంది" అని  
ట్విట్టర్ లో  మోడీ పోస్ట్ చేసారు. 

"వంట గ్యాస్‌ను మరింత సరసమైనదిగా చేయడం ద్వారా, మేము కుటుంబాల శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడం ఇంకా  ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం కూడా లక్ష్యంగా పెట్టుకున్నాము" అని ఆయన అన్నారు. 

"ఇది మహిళలకు సాధికారత కల్పించడానికి అలాగే  వారికి 'ఈజ్ ఆఫ్ లివింగ్'ని ఖచ్చితం చేయడానికి  మా నిబద్ధతకు అనుగుణంగా ఉంది," అని  పేర్కొన్నారు. 

ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 900 రూపాయలు ($11).

ఇదిలా ఉండగా, ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఉజ్వల యోజన కింద పేద మహిళలకు ఎల్‌పిజి సిలిండర్ సబ్సిడీపై రూ 300 పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది .

గత ఏడాది అక్టోబర్‌లో, ప్రభుత్వం సంవత్సరానికి 12 రీఫిల్‌ల వరకు 14.2 కిలోల సిలిండర్‌పై రూ. 200 నుండి   రూ.300కి పెంచింది. సిలిండర్‌కు రూ.300 సబ్సిడీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి  మార్చి 31తో ముగుస్తుంది .

అలాగే  మరో పోస్ట్‌లో, ప్రధాని మోదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

"మా నారీ శక్తి  బలం, ధైర్యం ఇంకా స్థితిస్థాపకతకు మేము అభివాదం చేస్తున్నాము.  ఇంకా వివిధ రంగాలలో వారి విజయాలను కొనియాడారు. విద్య, వ్యవస్థాపకత, వ్యవసాయం, సాంకేతికత అలాగే  మరిన్ని అంశాలలో మహిళలకు సాధికారత కల్పించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని ఆయన అన్నారు.

click me!