ఈ రోజు సోమవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఉపశమనం కొనసాగుతోంది. ఆయిల్ కంపెనీలు నేటికీ ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలో ధరలు మారలేదు. జాతీయ స్థాయిలో పెట్రోల్, డీజిల్ ధరలపై చివరిసారి మార్పు మే 2022న జరిగింది.
నేడు పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా 310వ రోజు సోమవారం అంటే మార్చి 27న స్థిరంగా ఉన్నాయి. గత ఏడాది 2022 మే 21న కేంద్రం పెట్రోల్పై లీటరుకు రూ. 8, డీజిల్పై రూ. 6 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన తరువాత దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు చివరిసారిగా తగ్గాయి.
ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31గా ఉండగా, డీజిల్ లీటర్ ధర రూ.94.27గా ఉంది.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, లీటర్ డీజిల్ ధర రూ.92.76. కాగా, చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24గా ఉన్నాయి. బెంగళూరులో పెట్రోల్ ధర రూ. 101.94, డీజిల్ ధర రూ. 87.89.
దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు స్థానిక పన్నుల బట్టి రాష్ట్రానికి నుండి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి.
ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విదేశీ మారకపు రేట్లు, అంతర్జాతీయ బెంచ్మార్క్ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలను సవరిస్తాయి.
యుఎస్లో ఎస్విబి అండ్ సిగ్నేచర్ బ్యాంక్ పతనం తరువాత క్రూడాయిల్ ధరలలో తగ్గుదల కనిపించింది. అప్పటి నుంచి బ్యారెల్కు దాదాపు $75 డాలర్ల వద్ద ఉంది. బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $75.07 డాలర్లుగా, WTI క్రూడ్ ధర బ్యారెల్కు $69.37 గా ఉంది.
దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు:
లక్నోలో పెట్రోల్ ధర రూ.96.57, లీటర్ డీజిల్ ధర రూ.89.76
విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.110.48, లీటర్ డీజిల్ ధర రూ.98.27
అహ్మదాబాద్ లో పెట్రోల్ ధర రూ.96.63, లీటర్ డీజిల్ ధర రూ.92.38
హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.109.66, లీటర్ డీజిల్ ధర రూ.97.82
పాట్నాలో పెట్రోల్ ధర రూ.107.24, లీటర్ డీజిల్ ధర రూ.94.04