ఇప్పుడు డబ్బు ఇంటికే వస్తుంది; కొత్త సిస్టమ్‌తో పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్..

Published : Apr 15, 2024, 10:24 AM IST
 ఇప్పుడు డబ్బు ఇంటికే వస్తుంది; కొత్త సిస్టమ్‌తో పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్..

సారాంశం

ఆధార్ ఆధారిత పేమెంట్   సిస్టంతో  ఆధార్ నంబర్‌కు లింక్ చేసిన అకౌంట్  నుండి బయోమెట్రిక్ డేటాను ఉపయోగించి విత్ డ్రా లేదా పేమెంట్  చేయవచ్చు.  

మీకు డబ్బు అవసరమైనప్పుడు మీరు ఇకపై బ్యాంకు లేదా ATM కి వెళ్లవలసిన అవసరం లేదు, ఎందుకంటే డబ్బు మీ ఇంటికి డెలివరీ చేయబడుతుంది. ఈ సర్వీస్  ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB) అందిస్తోంది. ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థ ద్వారా ఆధార్ నంబర్‌తో లింక్ చేయబడిన అకౌంట్  నుండి బయోమెట్రిక్ డేటాను ఉపయోగించి డబ్బును విత్‌డ్రా చేయడం లేదా పేమెంట్  చేయవచ్చు. కస్టమర్లు  ATM లేదా బ్యాంకు వెళ్లకుండా ATM ద్వారా మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. దీని కోసం, పోస్ట్‌మ్యాన్ మీ ఇంటికి వచ్చి డబ్బును విత్‌డ్రా చేయడానికి మీకు సహాయం చేస్తాడు.


ఆధార్ ఆధారిత పేమెంట్  సిస్టం అంటే ఏమిటి?

ఆధార్ ఆధారిత పేమెంట్  సిస్టం అనేది చెల్లింపు సేవ, ఇక్కడ బ్యాలెన్స్ ఎంక్వేరి, క్యాష్  విత్ డ్రా, మినీ స్టేట్‌మెంట్,  మని  ట్రాన్స్ఫర్  వంటి ప్రైమరీ  బ్యాంకింగ్ ట్రాన్సక్షన్స్  బయోమెట్రిక్‌తో మాత్రమే ఉపయోగించి చేయవచ్చు.

ఆధార్ ATM ఎలా ఉపయోగించాలి?
*దీని కోసం, ఒకరు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి డోర్ స్టెప్ బ్యాంకింగ్ అప్షన్  సెలెక్ట్ చేసుకోవాలి.
*ఇక్కడ పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి, అడ్రస్, పిన్ కోడ్, మీ ఇంటికి సమీపంలో ఉన్న పోస్టాఫీసు ఇంకా    బ్యాంక్  అకౌంట్ పేరు ఎంటర్  చేయండి.
*దీని తర్వాత I Agree ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
*కాసేపట్లో పోస్ట్‌మ్యాన్ డబ్బుతో మీ ఇంటికి చేరుకుంటాడు.
*AEPS ద్వారా లావాదేవీలు 10,000 రూపాయలకు పరిమితం చేయబడ్డాయి.
*ఈ రకమైన డబ్బును పొందడానికి  ప్రత్యేక చార్జెస్  చెల్లించాల్సిన అవసరం లేదు.

PREV
click me!

Recommended Stories

Gold Jewellery: బంగారు ఆభరణాలు అద్దెకు ఇస్తే నెలలో లక్షల రూపాయలు సంపాదించే ఛాన్స్
Govt Employees Arrears: త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల్లో చేతికి అందనున్న ఎరియర్స్