ముఖేష్ అంబానీ మెచ్చిన ఐస్ క్రీం; ప్రీ వెడ్డింగ్ పార్టీకి ఐస్ క్రీం తెచ్చిన కంపెనీ ఇదే..

By Ashok kumar SandraFirst Published May 10, 2024, 11:01 AM IST
Highlights

ఈ విందులో అతిథుల కోసం ముఖేష్ అంబానీ దాదాపు 2,500 వంటకాలను సిద్ధం చేశారు. అయితే ముఖేష్ అంబానీ తన కొడుకు పెళ్లికి సెలెక్ట్ చేసుకున్న ఐస్ క్రీం కంపెనీ ప్రత్యేకత ఏంటో తెలుసా ? 
 

ఈ ఏడాది స్టార్టింగ్లో  అనంత్ అంబానీ వివాహ వేడుకలను దేశం మొత్తం చూసింది. ఈ వేడుకకు ప్రపంచంలోని చాలా మంది ధనవంతులు తరలివచ్చారని చెప్పవచ్చు. ఫేస్‌బుక్ అధినేత  మార్క్ జుకర్‌బర్గ్, బిల్ గేట్స్  కూడా పాల్గొన్న విందు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో మూడు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సూపర్‌స్టార్లు, రాజకీయ ప్రముఖులు ఇంకా వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ విందులో అతిథుల కోసం ముఖేష్ అంబానీ దాదాపు 2,500 వంటకాలను సిద్ధం చేశారు. కొన్ని స్థానిక బ్రాండ్లు కూడా ఇందులో ఉన్నాయి. అయితే అందరి దృష్టిని ఆకర్షించినది అహ్మదాబాద్‌లోని శంకర్ ఐస్ క్రీమ్.

శంకర్ ఐస్ క్రీమ్ ప్రత్యేకత ఏమిటి? శంకర్ ఐస్ క్రీమ్ 1960 నుండి అహ్మదాబాద్‌లో అత్యుత్తమ ప్రీమియం ఐస్ క్రీమ్ కంపెనీ. శంకర్ ఐస్‌క్రీమ్‌కి భాగ్యేష్ సామ్నాని డైరెక్టర్. భాగ్యేష్ సమ్నాని మూడవ తరం వ్యాపారవేత్త. భాగ్యేష్ 2013లో తన తండ్రి అరుణ్‌భాయ్ సామ్నాని నుండి డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. శంకర్ ఐస్ క్రీమ్‌ను అహ్మదాబాద్‌లోని లా గార్డెన్‌లో భాగ్యేష్ తాత గోపిలాల్ సామ్నాని స్థాపించారు. 

2017లో భాగ్యేష్ అహ్మదాబాద్‌లో శంకర్ ఐస్ క్రీమ్ లైబ్రరీ పేరుతో ఐస్ క్రీమ్ పార్లర్‌ను ప్రారంభించాడు. బ్లాక్ జామూన్, జామున్-మ్యాంగో 
 మిక్స్, పుచ్చకాయ, మిక్స్డ్ బెర్రీస్ వంటి వివిధ ప్రత్యేక రుచులలో ఐస్ క్రీం అందుబాటులో ఉంది. శంకర్ ఐస్ క్రీమ్ వివిధ రకాల పూలు, కాయలు, చాక్లెట్లు ఇంకా పండ్లతో 1300కు పైగా వెరైటీ టేస్ట్స్ ఉన్నాయి. అందుకే ముఖేష్ అంబానీ తన కుమారుడి వివాహ వేడుకలకు శంకర్ ఐస్ క్రీంను సెలెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. 

click me!