
పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో కాఫీ, టీ ప్రియులకు షాక్ ఇచ్చేందుకు ప్రముఖ సంస్థలు, హిందుస్థాన్ యూనిలివర్, నెస్లే పలు ఉత్పత్తుల ధరలు పెంచేందుకు సిద్ధం అవుతోంది. హిందుస్థాన్ యూనిలీవర్ (HUL), నెస్లే నేటి నుండి (మార్చి 14) టీ, కాఫీ, పాలు, నూడుల్స్ ధరలను పెంచనున్నట్లు పలు వార్తా సంస్థలు తెలిపాయి.
దీని ప్రకారం హిందుస్థాన్ యూనిలివర్ ( HUL) బ్రూ కాఫీ ధరలను 3-7% పెంచింది. అదే సమయంలో, బ్రూ గోల్డ్ కాఫీ జార్ ధరలు కూడా 3-4% పెరిగాయి. ఇన్స్టంట్ కాఫీ పౌచ్ల ధరలు 3% నుంచి 6.66%కి పెరిగాయి.
అదే సమయంలో, తాజ్ మహల్ టీ ధరలు 3.7% నుండి 5.8% కి పెరిగాయి. బ్రూక్ బాండ్ వేరియంట్లకు చెందిన వివిధ టీ పొడుల ధరల విషయానికి వస్తే 1.5% నుండి 14% వరకు పెరిగాయి. నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన ఇతర ముడి పదార్థాల ధరల భారాన్ని కంపెనీ వినియోగదారులపై మోపాల్సి వస్తోందని హెచ్యుఎల్ పేర్కొంది.
మ్యాగీ ధరలు 9 నుంచి 16% పెరిగాయి.
మరోవైపు మ్యాగీ ధరలను 9 నుంచి 16 శాతం పెంచినట్లు నెస్లే ఇండియా ప్రకటించింది. నెస్లే ఇండియా పాలు, కాఫీ పొడి ధరలను సైతం పెంచింది. ధరలు పెంచిన తర్వాత ఇప్పుడు 70 గ్రాముల మ్యాగీ ప్యాకెట్పై రూ.12కి బదులు రూ.14 చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో, 140 గ్రాముల మ్యాగీ మసాలా నూడుల్స్ ధర 3 రూపాయలు అంటే 12.5% పెరిగింది. కాగా ఇప్పుడు 560 గ్రాముల మ్యాగీ ప్యాక్కు రూ.96 బదులు రూ.105 చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం, దాని ధర 9.4% పెరిగింది.
పాలపొడి కూడా ఖరీదైంది
నెస్లే ఒక లీటర్ A+ పాల ధరలను కూడా పెంచింది. దీనికి గతంలో 75 రూపాయలు చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు 78 రూపాయలు చెల్లించాల్సి ఉంది. Nescafe Classic Coffee Powder ధరలు 3-7% పెరిగాయి. అదే సమయంలో, 25 గ్రాముల Nescafe ప్యాక్ ఇప్పుడు 2.5% ఖరీదైనది. ఇందుకోసం 78 రూపాయల బదులు ఇప్పుడు 80 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు రూ.145కి బదులు 50 గ్రాముల నెస్కేఫ్ క్లాసిక్ రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.