వీసా ఆంక్షలతో అమెరికాకే నష్టం: ట్రంప్ కి టిసిఎస్ సిఇఓ హెచ్చరిక..

By Sandra Ashok KumarFirst Published Jul 10, 2020, 6:02 PM IST
Highlights

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సిఇఒ రాజేష్ గోపినాథన్ మాట్లాడుతూ, ఈ చర్య వల్ల ఇండియన్ ఇంజనీర్లపై భారీ ఒత్తిడికి గురిచేస్తుంది, ఎందుకంటే వారు యు.ఎస్. లో చాలా సంవత్సరాలుగా నివసిస్తూ అమెరికన్ క్లయింట్లకు మెరుగైన సేవలందించారని గుర్తు చేశారు. 

బెంగళూరు: ఆసియా అతిపెద్ద ఐటి సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్‌ గోపీనాథ్‌ ఉపాధి వీసాల  హెచ్‌–1బీ, ఎల్‌–1 వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  ఆంక్షలు విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు.

ఈ నిర్ణయం వల్ల వాల్ స్ట్రీట్ బ్యాంకులు, ఆటో తయారీదారులు, ఔషధ తయారీదారుల వంటి అమెరికన్ సంస్థలకు మాత్రమే ఖర్చులను పెంచుతుందని హెచ్చరించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ సిఇఒ రాజేష్ గోపినాథన్ మాట్లాడుతూ, ఈ చర్య వల్ల ఇండియన్ ఇంజనీర్లపై భారీ ఒత్తిడికి గురిచేస్తుంది, ఎందుకంటే వారు యు.ఎస్. లో చాలా సంవత్సరాలుగా నివసిస్తూ అమెరికన్ క్లయింట్లకు మెరుగైన సేవలందించారని గుర్తు చేశారు.

యు.ఎస్. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ చివరిలో  పలు వీసాలపై ఈ ఏడాది చివరి వరకు ఆమోదాన్ని నిలిపిస్తున్నట్లు తెలిపారు. గత కొన్నేళ్లుగా ఎలక్ట్రానిక్స్‌ తదితర రంగాలలో నైపుణ్యం ఉన్న టీసీఎస్‌, ఇన్ఫోసిస్ లిమిటెడ్ వంటి కంపనీల ఉద్యోగులు కొన్ని సంవత్సరాలుగా అమెరికాకు సేవలందించారని తెలిపారు.

also read టాటా సన్స్ చేతికి ఎయిర్‌ ఏషియా ఇండియా..? ...

అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఎంతో శ్రమించిన దేశీయ ఐటీ నిపుణుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా ఉందని అన్నారు. అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్లో తమ పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. "కుటుంబాలకు దూరంగా ఉంటూ, వినియోగదారులకు విలువైన సేవలను అందించడానికి మైగ్రాంట్ హోదా కూడా లేకుండా ఐదు-ఆరు సంవత్సరాలుగా విదేశీ దేశంలో గడపడానికి కట్టుబడి ఉన్న వ్యక్తుల స్థితితో ఆడుకోవటం జిమ్మిక్" అని ఎగ్జిక్యూటివ్ చెప్పారు.

వాల్ స్ట్రీట్ బ్యాంకుల నుండి సిలికాన్ వ్యాలీ వంటి టెక్ దిగ్గజాల వరకు కోవిడ్ -19 మహమ్మారి తన క్లయింట్స్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన తరువాత టిసిఎస్ గురువారం అంచనాల కంటే  తక్కువ లాభాలను నివేదించింది. వీసా నియంత్రణలు టిసిఎస్ సొంత వ్యాపారంపై ఎటువంటి ప్రభావం చూపలేదు కాని ఖచ్చితంగా ఉద్యోగులను కలవరపెడతాయి, అని గోపీనాథన్ అన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ పెరగడంతో కంపెనీలు తన వేలాది మంది వర్కార్లకు తిరిగి శిక్షణ పొందవలసి వచ్చింది. అభివృద్ధి చెందుతున్న కస్టమర్ల అవసరాలను తీర్చడానికి కొత్త క్లౌడ్, సాఫ్ట్‌వేర్ ఆధారిత సేవల్లో పెట్టుబడులు పెట్టవలసి వచ్చింది. గత నెలలో ట్రంప్ తీసుకున్న వీసా నిషేధం మరింత అనిశ్చితికి దారితీసింది.

click me!