Gold and Silver Prices Today: ఉమెన్స్ డే నాడు మ‌హిళ‌ల‌కు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 08, 2022, 09:35 AM IST
Gold and Silver Prices Today: ఉమెన్స్ డే నాడు మ‌హిళ‌ల‌కు షాక్‌.. భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు..!

సారాంశం

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రోజురోజుకూ పతాక స్థాయిలో పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పుడు ఒకేసారి భారీగా పెరిగి.. ఉమెన్స్‌ డే నాడు మహిళలకు షాకిచ్చింది. 

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రోజురోజుకూ పతాక స్థాయిలో పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పుడు ఒకేసారి భారీగా పెరిగి.. ఉమెన్స్‌ డే నాడు మహిళలకు షాకిచ్చింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం క్రూడ్ ఆయిల్, బంగారం ధరలపై పెను ప్రభావమే చూపిస్తోంది. గత కొద్దిరోజులుగా నెలకొన్న పరిస్థితులు ధరలపై, ఇతర దేశాలపై ప్రభావం చూపిస్తున్నాయి. 

అంతర్జాతీయంగా బంగారం, వెండి డిమాండ్, కేంద్ర రిజర్వ్ బ్యాంకుల్లో బంగారం డిమాండ్, వడ్డీ రేట్లు, వివిధ దేశాల మధ్య భౌగోళిక పరిస్థితులు, కరోనా మహమ్మారి, డాలర్ విలువ వంటివి ప్రభావం చూపిస్తుండటం వల్ల బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ముఖ్యంగా పసిడి ధర రోజురోజుకూ పరుగెడుతోంది. మహిళలకు మక్కువైన బంగారం.. ప్రపంచ మహిళా దినోత్సవం నాడు ఒక్కరోజులోనే వేయి రూపాయలు పెరిగి షాకిచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో నేటి (మార్చి 8, 2022) బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

బంగారం ధ‌ర‌లు

దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 49,400 కాగా, 24 క్యారెట్ల ధర రూ. 53,890గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 49,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 53,890గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 50,710 కాగా, 24 క్యారెట్ల ధర రూ. 55,320గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 49,400 కాగా.. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 53,890గా వద్ద కొనసాగుతోంది.

ఇక తెలుగు రాష్ట్రాలైన‌.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 49,400 కాగా.. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 53,890గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ. 49,400 కాగా.. 24 క్యారెట్ల ధర రూ. 53,890గా కొన‌సాగుతోంది. ఇక విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. 

వెండి ధ‌ర‌లు

ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,000గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండి ధర రూ. 71,000గా ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 75,700గా వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 71,000గా ఉంది. కేరళ, బెంగ‌ళూరు న‌గ‌రాల్లో కిలో వెండి ధర రూ. 75,700గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.75,700గా పలుకుతోంది. విజయవాడలో కిలో వెండి ధర రూ. 75,700గా ఉంది. విశాఖపట్నంలో వెండి ధ‌ర‌ రూ. 75,700గా ఉంది.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Most Expensive Vegetables : కిలో రూ.1 లక్ష .. భారత్‌లో అత్యంత ఖరీదైన కూరగాయలు ఇవే
iPhone : ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 17 ప్రో, 15 ప్లస్‌పై భారీ తగ్గింపులు !